అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కురిసిన వర్షాలకు నదులు, వాగులు, పొంగి.. చెరువులకు నీరు చేరాయి.
కళ్యాణదుర్గం మండలం ముదిగల్లు గ్రామంలో రైతు మంజునాథకు చెందిన 250కి పైగా అరటి చెట్లు ఈదురు గాలులు వర్షానికి నేలమట్టమయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న అరటి చెట్లు కూలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
పెరిగిన భూగర్భ జలాలు..
బ్రహ్మసముద్రం మండలం తీటకల్లు గ్రామంలో చెరువుకు భారీగా వరద నీరు చేరింది. ఈ వర్షాలు భూగర్భ జలాలు పెరగడానికి ఉపయోగకరంగా ఉంటాయని రైతులు భావిస్తున్నా, ప్రస్తుతం కొన్ని పంటలు దెబ్బతినడంతో రైతులు తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఇదీ చదవండీ.. గట్ల వద్ద గంజాయి దాస్తే.. పోలీసులు పట్టుకున్నారు...