ETV Bharat / state

భూములు కోల్పోయిన రైతులకు అండగా ఉంటాం: సీపీఎం - cpm central committee members in anantapur

అనంతపురం జిల్లా కేతపల్లిలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు అండగా ఉంటామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు భరోసా ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిన భూములను పార్టీ స్థానిక నాయకులతో కలిసి వారు సందర్శించారు.

cpm central committee members visit factory allocated lands
భూములు కోల్పోయిన రైతులకు అండగా ఉంటాం: సీపీఎం
author img

By

Published : Nov 8, 2020, 7:48 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం కేతపల్లి గ్రామంలో పరిశ్రమ ఏర్పాటు కోసం గతంలో రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూములను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు సందర్శించారు. భూములు తీసుకుని 16 ఏళ్లు గడిచిన పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుబట్టారు.

గతంలో పరిశ్రమలకు గాను ఈ ప్రాంత రెైతులు 16 వందల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. ఏళ్లు గడిచినా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పరిశ్రమల కోసం రైతుల నుంచి తీసుకున్న భూమిలో ఐదు ఏళ్లలోపు పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే వాటిని తిరిగి రైతులకే ఇవ్వాలి. అయినా ప్రభుత్వం మీ భూములు మీకు ఇవ్వలేదు. ఈ క్రమంలో భూముల కోసం మీరు చేస్తున్న పోరాటానికి మద్దతుగా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కమిటీ సభ్యులు శ్రీనివాస రావు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో శ్రీనివాస రావుతోపాటు దక్షిణ ప్రాంత జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహమ్మద్, తదితర నాయకులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా మడకశిర మండలం కేతపల్లి గ్రామంలో పరిశ్రమ ఏర్పాటు కోసం గతంలో రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూములను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు సందర్శించారు. భూములు తీసుకుని 16 ఏళ్లు గడిచిన పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుబట్టారు.

గతంలో పరిశ్రమలకు గాను ఈ ప్రాంత రెైతులు 16 వందల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. ఏళ్లు గడిచినా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పరిశ్రమల కోసం రైతుల నుంచి తీసుకున్న భూమిలో ఐదు ఏళ్లలోపు పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే వాటిని తిరిగి రైతులకే ఇవ్వాలి. అయినా ప్రభుత్వం మీ భూములు మీకు ఇవ్వలేదు. ఈ క్రమంలో భూముల కోసం మీరు చేస్తున్న పోరాటానికి మద్దతుగా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కమిటీ సభ్యులు శ్రీనివాస రావు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో శ్రీనివాస రావుతోపాటు దక్షిణ ప్రాంత జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహమ్మద్, తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ట్రంప్​ను తలుచుకోగానే గుర్తొచ్చే వ్యక్తి.. సీఎం జగన్​: పట్టాభి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.