ETV Bharat / state

వేతనాలు పెంచాలని కార్మికులు ఆందోళన - అనంతపురం జిల్లా వార్తలు

హిందూపురం తూముకుంట పారిశ్రామికవాడలోని గార్మెంట్ పరిశ్రమలలో కార్మికులు వేతనాలు పెంచాలని ధర్నా చేపట్టారు. వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో ఉద్రిక్తత నెలకొంది.

cpi cpm protest
cpi cpm protest
author img

By

Published : Oct 8, 2020, 12:06 PM IST

వేతనాలు పెంచాలని కార్మికులు ఆందోళన

అనంతపురం జిల్లా హిందూపురం.. తూముకుంట పారిశ్రామికవాడలోని గార్మెంట్ పరిశ్రమలలో కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు వేతనాలు పెంచాలంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో.. మహిళా కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఫ్యాక్టరీ ముందు నిరసనకు బైఠాయించిన సీపీఐ ,సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించగా.. మహిళా కార్మికులు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. వాహనాల ఎదుట బైఠాయించారు. పోలీసులకు మహిళా కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. వెంటనే యాజమాన్యం వేతనాలు పెంచి బోనస్​లు ఇవ్వాలని.. లేనిపక్షంలో ఉద్యమం తారా స్థాయికి చేరుకుంటుందని కార్మికులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'ఇది ఓ ప్రజా ఉద్యమం- అంతిమ విజయం మనదే'

వేతనాలు పెంచాలని కార్మికులు ఆందోళన

అనంతపురం జిల్లా హిందూపురం.. తూముకుంట పారిశ్రామికవాడలోని గార్మెంట్ పరిశ్రమలలో కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు వేతనాలు పెంచాలంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో.. మహిళా కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఫ్యాక్టరీ ముందు నిరసనకు బైఠాయించిన సీపీఐ ,సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించగా.. మహిళా కార్మికులు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. వాహనాల ఎదుట బైఠాయించారు. పోలీసులకు మహిళా కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. వెంటనే యాజమాన్యం వేతనాలు పెంచి బోనస్​లు ఇవ్వాలని.. లేనిపక్షంలో ఉద్యమం తారా స్థాయికి చేరుకుంటుందని కార్మికులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'ఇది ఓ ప్రజా ఉద్యమం- అంతిమ విజయం మనదే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.