ETV Bharat / state

కంటైన్మెంట్ జోన్​​ను ఎత్తివేయాలని గుంతకల్లు వాసుల ఆందోళన

కంటైన్మెంట్ జోన్​ను ఎత్తివేయాలని అనంతపురం జిల్లా గుంతకల్లు ఆంథోనిస్ట్రీట్ వాసులు నిరసన చేశారు. నిత్యావసరాలు, కూరగాయలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : May 8, 2020, 7:56 PM IST

concerned about lifting the red zone in gunthakallu anathapuram district
రెడ్​జోన్​ను ఎత్తివేయాలంటూ గుంతకల్లు వాసుల ఆందోళన

అనంతపురం జిల్లా గుంతకల్లు అంథోనిస్ట్రీట్​లో కంటైన్మెంట్ జోన్​ను ఎత్తి వేయాలని కాలనీ వాసులు ఆందోళన చేశారు. పనులు లేక, నిత్యావసర వస్తువులు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్​జోన్​గా ప్రకటించి 21 రోజులు అవుతున్నా కేవలం బియ్యం, కందిపప్పు , రూ.వెయ్యితో ఎలా బతకాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతవరకు తమను ఏ రాజకీయ నాయకులు గానీ, అధికారులు గానీ పట్టించుకోలేదని వాపోయారు. రెండు రోజుల్లో రెడ్​జోన్​ను ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని స్థానిక తహసీల్దార్ హరికుమార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు అంథోనిస్ట్రీట్​లో కంటైన్మెంట్ జోన్​ను ఎత్తి వేయాలని కాలనీ వాసులు ఆందోళన చేశారు. పనులు లేక, నిత్యావసర వస్తువులు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్​జోన్​గా ప్రకటించి 21 రోజులు అవుతున్నా కేవలం బియ్యం, కందిపప్పు , రూ.వెయ్యితో ఎలా బతకాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతవరకు తమను ఏ రాజకీయ నాయకులు గానీ, అధికారులు గానీ పట్టించుకోలేదని వాపోయారు. రెండు రోజుల్లో రెడ్​జోన్​ను ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని స్థానిక తహసీల్దార్ హరికుమార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీచదవండి.

స్వస్థలాలకు పంపాలని వలస కూలీల వేడుకోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.