అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు గ్రామంలో రమేష్ అనే వ్యక్తి ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. డబ్బులు పంచుతున్నారంటూ రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు రమేశ్పై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న రమేశ్ వర్గీయులు, రాజగోపాల్ రెడ్డి వర్గీయులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
9 మందికి గాయం..
ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 9 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న తాడిపత్రి పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితులను తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో మళ్లీ ఉద్రిక్తత ఏర్పడకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ఇదీచదవండి.