ETV Bharat / state

విషాదం: నీటిలో మునిగి చిన్నారి మృతి - anantapur district crime news

అంతసేపూ తన ముందు ఆడుకుంటున్న ఆ చిన్నారిని చూసి మురిసింది ఆ తల్లి. కానీ.. ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. కాలువలోని నీటిలో ఆడుకుంటూనే.. ప్రమాదవశాత్తు లోతు ప్రాంతానికి వెళ్లి ఆ చిన్నారి మునిగిపోయింది. అది చూసిన తల్లి గట్టిగా కేకలు పెట్టింది. చుట్టుపక్కల వారు వచ్చి చిన్నారికి బయటకు తెచ్చారు. అప్పటికే ఆ చిన్నారి లోకం వదిలి వెళ్లి పోయింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

child died
చిన్నారి మృతి
author img

By

Published : May 4, 2021, 3:14 PM IST

అనంతపురం జిల్లా కూడేరు మండలం పి.నారాయణపురంలో ప్రమాదవశాత్తు హంద్రీనీవా కాలువలో మునిగి నవనితిక (11) మృతి చెందింది. సోమవారం గ్రామానికి చెందిన అక్కమ్మ తన కూతురు నవనితికతో కలిసి బట్టలు ఉతికేందుకు కాలువ వద్దకు వెళ్లింది.

అక్కమ్మ బట్టలు పిండుతున్న క్రమంలో నవనితిక నీళ్లల్లో ఆడుకుంటూ లోతు ఉన్న ప్రాంతానికి వెళ్లి మునిగిపోయింది. ఇది గమనించిన తల్లి గట్టిగా కేకలు వేయగా... చుట్టుపక్కల పొలం పని చేస్తున్న రైతులు వచ్చి చిన్నారిని బయటకు తీశారు. అప్పటికే బాలిక మృతి చెందింది.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా కూడేరు మండలం పి.నారాయణపురంలో ప్రమాదవశాత్తు హంద్రీనీవా కాలువలో మునిగి నవనితిక (11) మృతి చెందింది. సోమవారం గ్రామానికి చెందిన అక్కమ్మ తన కూతురు నవనితికతో కలిసి బట్టలు ఉతికేందుకు కాలువ వద్దకు వెళ్లింది.

అక్కమ్మ బట్టలు పిండుతున్న క్రమంలో నవనితిక నీళ్లల్లో ఆడుకుంటూ లోతు ఉన్న ప్రాంతానికి వెళ్లి మునిగిపోయింది. ఇది గమనించిన తల్లి గట్టిగా కేకలు వేయగా... చుట్టుపక్కల పొలం పని చేస్తున్న రైతులు వచ్చి చిన్నారిని బయటకు తీశారు. అప్పటికే బాలిక మృతి చెందింది.

ఇదీ చదవండి:

అంబులెన్స్, బొలెరో వాహనం ఢీ.. ఇద్దరికి గాయాలు

మర్రిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.