ETV Bharat / state

కుమారుడికి బ్రెయిన్ ట్యూమర్.. సాయం కోసం తల్లిదండ్రుల నిరీక్షణ - అనంతపురంలో బ్రెయిస్ ట్యూమర్ బాలుడు వార్తలు

బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న తమ కుమారుడికి వైద్యం చేయించలేక ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఉన్న ఆస్తంతా వైద్యానికి ఖర్చు చేశారు. ఆయినా కుమారుడి పరిస్థితి మెరుగుపడలేదు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలో చేయూత కోసం ఎదురుచూస్తున్నారు.

brain-tumor-boy
brain-tumor-boy
author img

By

Published : Dec 11, 2019, 7:02 PM IST

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని కార్వేటి నాగేపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీపతిరెడ్డిది వ్యవసాయ కుటుంబం. భార్య, ఇద్దరు కుమారులతో జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో.. చిన్న కుమారుడు ఉదయ్ కిరణ్‌కు బ్రెయిన్ ట్యూమర్ సోకింది. బెంగళూరులోని కిద్వాయ్ వైద్యశాలలో 2 శస్త్రచికిత్సలు చేయించారు. అప్పుడు ఉదయ్‌ వయసు మూడేళ్లు. అనంతరం ఆరోగ్యం మెరుగుపడి అందరిలానే పాఠశాలకు వెళ్లి చదువుకుంటూ ఉండేవాడు. అయితే ఉదయ్ ఎనిమిదో తరగతికి వచ్చేసరికి మరోసారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డాడు. ఈసారి శస్త్రచికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. నాలుగేళ్లుగా ఆ బాలుడు మంచానికే పరిమితమయ్యాడు.

ఉన్న ఎకరం పొలం, బంగారు నగలు అమ్మేసి కుమారుడికి వైద్యం చేయించారు ఉదయ్ తల్లిదండ్రులు. 10 లక్షలకు పైగా ఖర్చయ్యింది కానీ.. వ్యాధి నయం కాలేదు. ప్రస్తుతం బాలుణ్ని వారానికోసారి వైద్య పరీక్షల కోసం బెంగళూరుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. అందుకోసం ప్రతి వారం 15 నుంచి 20 వేల రూపాయల వరకు ఖర్చవుతోందని వారు వాపోయారు. ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన కుటుంబం.. కుమారుడికి వైద్యం చేయించలేక మానసికంగా మరింత కుంగిపోతుంది.

ఈ పరిస్థితుల్లో పెద్ద కుమారుడికి ఫీజులు కట్టలేక ఇంటర్‌తో చదువు మాన్పించారు. ప్రభుత్వం, దాతలు స్పందించి తమ కుమారుడి వైద్యానికి చేయూతనందించాలని ఉదయ్‌కిరణ్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

'బ్రెయిన్ ట్యూమర్‌తో నాలుగేళ్లుగా మంచాన పడిన కొడుకు కోసం'

ఇవి కూడా చదవండి:

పీఎస్​ఎల్వీ-సీ 48 ప్రయోగం విజయవంతం

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని కార్వేటి నాగేపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీపతిరెడ్డిది వ్యవసాయ కుటుంబం. భార్య, ఇద్దరు కుమారులతో జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో.. చిన్న కుమారుడు ఉదయ్ కిరణ్‌కు బ్రెయిన్ ట్యూమర్ సోకింది. బెంగళూరులోని కిద్వాయ్ వైద్యశాలలో 2 శస్త్రచికిత్సలు చేయించారు. అప్పుడు ఉదయ్‌ వయసు మూడేళ్లు. అనంతరం ఆరోగ్యం మెరుగుపడి అందరిలానే పాఠశాలకు వెళ్లి చదువుకుంటూ ఉండేవాడు. అయితే ఉదయ్ ఎనిమిదో తరగతికి వచ్చేసరికి మరోసారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డాడు. ఈసారి శస్త్రచికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. నాలుగేళ్లుగా ఆ బాలుడు మంచానికే పరిమితమయ్యాడు.

ఉన్న ఎకరం పొలం, బంగారు నగలు అమ్మేసి కుమారుడికి వైద్యం చేయించారు ఉదయ్ తల్లిదండ్రులు. 10 లక్షలకు పైగా ఖర్చయ్యింది కానీ.. వ్యాధి నయం కాలేదు. ప్రస్తుతం బాలుణ్ని వారానికోసారి వైద్య పరీక్షల కోసం బెంగళూరుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. అందుకోసం ప్రతి వారం 15 నుంచి 20 వేల రూపాయల వరకు ఖర్చవుతోందని వారు వాపోయారు. ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన కుటుంబం.. కుమారుడికి వైద్యం చేయించలేక మానసికంగా మరింత కుంగిపోతుంది.

ఈ పరిస్థితుల్లో పెద్ద కుమారుడికి ఫీజులు కట్టలేక ఇంటర్‌తో చదువు మాన్పించారు. ప్రభుత్వం, దాతలు స్పందించి తమ కుమారుడి వైద్యానికి చేయూతనందించాలని ఉదయ్‌కిరణ్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

'బ్రెయిన్ ట్యూమర్‌తో నాలుగేళ్లుగా మంచాన పడిన కొడుకు కోసం'

ఇవి కూడా చదవండి:

పీఎస్​ఎల్వీ-సీ 48 ప్రయోగం విజయవంతం

Intro:ap_atp_56_10_brain_tumor_badhithudu_avb_ap10099
Date:10-12-2019
center:penukonda
contributor:c.a.naresh
cell:9100020922
EMP ID:AP10099
బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న కుమారుడిని చూసి కుంగిపోతున్న తల్లిదండ్రులు...
*ప్రభుత్వం దాతలు ఆదుకోవాలని కుమారుడి వైద్య చికిత్సకు చేయూతను అందించాలి
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం లోని కార్వేటి నాగేపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీపతి రెడ్డి,మహేశ్వరి దంపతులు. వీరిది వ్యవసాయ ఆధారిత కుటుంబం వీరికి ఇద్దరు కుమారులు జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో చిన్న కుమారుడు ఉదయ్ కిరణ్ రెడ్డికి మూడు సంవత్సరాల వయసులోనే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి సోకింది. అప్పట్లో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కిద్వాయ్ వైద్యశాలలో రెండు శస్త్ర చికిత్స చేయించారు. అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల పాటు అందరి పిల్లల్లాగే పాఠశాలకు వెళ్తుండేవాడు. గత మూడు సంవత్సరాల క్రితం 8వ తరగతి చదువుతున్న సమయంలో మరోసారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డాడు ఈసారి శస్త్ర చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. గడిచిన మూడు సంవత్సరాలుగా బాలుడు మంచానికే పరిమితం అయిపోయాడు. అప్పట్నుంచి బాలుడి వైద్యం కోసం ఆ దంపతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో ఒక ఎకరం పొలం అమ్మేసి వైద్య చికిత్స చేయించారు. నయము కాకపోవడంతో లక్ష్మీపతి రెడ్డి ఇంట్లోని బంగారు నగలను సైతం అమ్మేసి కుమారుడికి చికిత్స చేయించారు. నేటికీ కుమారుడి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో వారు దీనిని చూసి దంపతులు ప్రతిరోజు బాధపడుతున్నారు. వైద్యం కోసం పది లక్షలకు పైగా ఖర్చు చేశారు. ప్రస్తుతం బాలుడిని వారానికోసారి వైద్య పరీక్షల కోసం బెంగుళూరుకు తీసుకెళ్లాల్సి ఉంది ఇందుకోసం ప్రతి వారం రూ 15 వేల నుంచి 20 వేల వరకు ఖర్చవుతుంది. ఉన్నదంతా వైద్యానికి ఖర్చు అవడంతో పెద్ద కుమారుడు జగదీష్ ని సైతం ఇంటర్మీడియట్ తరువాత ఉన్నత చదువులు చదివించే స్తోమత లేక చదువు మాన్పించి వేశారు. ప్రస్తుతం బాలుడిని వైద్య చికిత్సలకు తీసుకెళ్లడానికి తమ వద్ద తగినంత సొమ్ము లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాతలు కానీ ప్రభుత్వం గానీ తమ కుమారుడి వైద్య చికిత్సల కోసం చేయూతను అందించాలని వారు వేడుకుంటున్నారు
బైట్ లు:
(1) లక్ష్మీపతి రెడ్డి, మహేశ్వరి ఉదయ్ కిరణ్ రెడ్డి తల్లిదండ్రులు


Body:ap_atp_56_10_brain_tumor_badhithudu_avb_ap10099


Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.