ETV Bharat / state

ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌కు మద్దతుగా నిలిచిన మహిళకు వేధింపులు

author img

By

Published : Sep 2, 2022, 12:15 PM IST

ఉద్యోగం నుంచి తొలగించబడిన ఏఆర్​ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌కు అనుకూలంగా సాక్ష్యం చెప్పిన లక్ష్మీ అనే మహిళ ఇంటి వద్ద ఆమె మాజీ భర్త హల్‌చల్‌ చేశాడు. విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నప్పటికీ అర్థరాత్రి తాగి వచ్చిన భర్త వేణుగోపాల్‌రెడ్డి, భావ నారాయణరెడ్డి గొడవకు దిగారు. విడాకులు తీసుకున్న తర్వాత తనతో వారికి సంబంధం ఏంటని లక్ష్మీ ప్రశ్నించారు. వారికి పోలీసులు సైతం మద్దతు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు. న్యాయం చేయాల్సిన పోలీసులే తమ ప్రాణాలు తీసేందుకు యత్నిస్తున్నారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

AR constable
హల్​చల్

ఉద్యోగం నుంచి తొలగించబడిన ఏఆర్ కానిస్టేబుల్ కేసులో సాక్ష్యం చెప్పిన లక్ష్మీ ఇంటి వద్ద ఆమె మాజీ భర్త హల్​చల్​ చేశాడు. లక్ష్మీ భర్త వేణుగోపాల్ రెడ్డి, అతని సోదరుడు నారాయణరెడ్డి గొడవకు దిగారు. భర్తతో తనకు సంబంధం లేదని, విడాకులు కూడా తీసుకున్నాని, కానీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా వచ్చి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలా ఇబ్బందులకు గురి చేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేసింది.

మరోవైపు పోలీసులు మాత్రం... డయల్ 100కు ఫిర్యాదు రావడంతో వచ్చామని చెబుతున్నారు. విడాకులు తీసుకున్న నోటీసులను పోలీసులకు చూపించి గొడవ లేకుండా చూడాలని లక్ష్మీ కోరింది. గొడవ చేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులని పోలీసులు స్టేషన్​కు తీసుకెళ్లారు. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ విషయంలో సాక్ష్యం చెప్పినప్పటి నుంచి పోలీసులు తనను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని మహిళ ఆరోపించింది.

ఇటీవల బాధితురాలు ఏం చెప్పారంటే: తనను బూచిగా చూపి అనంతపురం ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను విధుల నుంచి తొలగించారని ఆ కేసులో పోలీసులు ‘బాధితురాలు’గా పేర్కొన్న బి.లక్ష్మి తెలిపారు. ఈ ఏడాది జూన్‌ 14న శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగిన సభకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకాగా, తమ బకాయిలు చెల్లించాలంటూ అదేరోజు అనంతపురంలో ప్లకార్డులు ప్రదర్శించిన కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను విధుల్లోంచి తొలగించిన విషయం తెలిసిందే. గార్లదిన్నెకు చెందిన మహిళ నుంచి ప్రకాశ్‌ బంగారం, డబ్బు తీసుకున్నారనే అభియోగంపై అతన్ని డిస్మిస్‌ చేస్తున్నట్లు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఆదివారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. ఈ కేసులోని బాధితురాలు లక్ష్మి సోమవారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. ప్రకాశ్‌ తన నుంచి 30 తులాల బంగారం, రూ.10 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు మోపిన అభియోగంలో నిజం లేదని స్పష్టంచేశారు. కానిస్టేబుల్‌ తనను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, కక్ష సాధింపులో భాగంగానే తనను అడ్డం పెట్టుకుని ఆయనను డిస్మిస్‌ చేశారని వాపోయారు.

తప్పుడు స్టేట్‌మెంట్‌ రాయించారు; ‘నా భర్త, అతని కుటుంబసభ్యులు నన్ను వేధిస్తున్నారని నాలుగేళ్ల కిందట గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అక్కడ న్యాయం జరగకపోవడంతో 2019లో ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వెళ్లాను అక్కడున్న సీఎం వలీ అనే కానిస్టేబుల్‌ నా ఫిర్యాదు రాస్తానని చెప్పి, నేను నా భర్త వేధింపుల గురించి చెప్తే ఆయన మరోలా రాశారు. కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ నన్ను వేధిస్తున్నట్లు, అత్యాచారం చేసినట్లు, నా నుంచి డబ్బు, బంగారం తీసుకుని మోసం చేసినట్లుగా రాశారు.

ఎస్పీ వెళ్లిపోతున్నారని తొందరపెట్టి స్టేట్‌మెంట్‌ చదివే అవకాశం ఇవ్వకుండానే నాతో సంతకం చేయించుకున్నారు. దాని ఆధారంగానే కేసు నమోదుచేసి, అప్పటి డీఎస్పీ వీరరాఘవరెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టారు. కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ నాపై అత్యాచారం చేసినట్లు మీడియాతో చెప్పారు. డీఎస్పీ ప్రెస్‌మీట్‌లో చెప్పింది తప్పు అని అప్పట్లోనే నేను టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేశాను. సీఐ జాకీర్‌ ఫిర్యాదు తీసుకోకుండా, విషయాన్ని కోర్టులో తేల్చుకోవాలన్నారు. నేను కోర్టును ఆశ్రయించి డీఎస్పీకి లీగల్‌ నోటీసులు ఇప్పించాను. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఇవేమీ పట్టించుకోకుండా నన్ను బూచిగా చూపించి ప్రకాశ్‌ను డిస్మిస్‌ చేయడం అన్యాయం.

డీఎస్పీ మా కుటుంబ పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించారు. ఇప్పుడు నా భర్త, పోలీసుల నుంచి మాకు ప్రాణహాని ఉంది. ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత’ అని లక్ష్మి ఆవేదన చెందారు. ‘నా భర్త వేధింపులు తాళలేక ఎన్నోసార్లు గార్లదిన్నె పోలీసులు, జిల్లా ఎస్పీని ఆశ్రయించాను. స్పందనకు హాజరైనప్పుడు ప్రకాశ్‌ పరిచయమయ్యారు. కేసులో నాకు సహకరించారు. అప్పటికే అతనిపై కక్ష పెంచుకున్న ఉన్నతాధికారులు మా మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు చిత్రీకరించారు. కానిస్టేబుల్‌ సీఎం వలీ, డీఎస్పీ వీరరాఘవరెడ్డి ఈ దుష్ప్రచారం చేశారని’ ఆమె ఆరోపించారు.

ఇవీ చదవండి:

ఉద్యోగం నుంచి తొలగించబడిన ఏఆర్ కానిస్టేబుల్ కేసులో సాక్ష్యం చెప్పిన లక్ష్మీ ఇంటి వద్ద ఆమె మాజీ భర్త హల్​చల్​ చేశాడు. లక్ష్మీ భర్త వేణుగోపాల్ రెడ్డి, అతని సోదరుడు నారాయణరెడ్డి గొడవకు దిగారు. భర్తతో తనకు సంబంధం లేదని, విడాకులు కూడా తీసుకున్నాని, కానీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా వచ్చి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలా ఇబ్బందులకు గురి చేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేసింది.

మరోవైపు పోలీసులు మాత్రం... డయల్ 100కు ఫిర్యాదు రావడంతో వచ్చామని చెబుతున్నారు. విడాకులు తీసుకున్న నోటీసులను పోలీసులకు చూపించి గొడవ లేకుండా చూడాలని లక్ష్మీ కోరింది. గొడవ చేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులని పోలీసులు స్టేషన్​కు తీసుకెళ్లారు. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ విషయంలో సాక్ష్యం చెప్పినప్పటి నుంచి పోలీసులు తనను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని మహిళ ఆరోపించింది.

ఇటీవల బాధితురాలు ఏం చెప్పారంటే: తనను బూచిగా చూపి అనంతపురం ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను విధుల నుంచి తొలగించారని ఆ కేసులో పోలీసులు ‘బాధితురాలు’గా పేర్కొన్న బి.లక్ష్మి తెలిపారు. ఈ ఏడాది జూన్‌ 14న శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగిన సభకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకాగా, తమ బకాయిలు చెల్లించాలంటూ అదేరోజు అనంతపురంలో ప్లకార్డులు ప్రదర్శించిన కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను విధుల్లోంచి తొలగించిన విషయం తెలిసిందే. గార్లదిన్నెకు చెందిన మహిళ నుంచి ప్రకాశ్‌ బంగారం, డబ్బు తీసుకున్నారనే అభియోగంపై అతన్ని డిస్మిస్‌ చేస్తున్నట్లు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఆదివారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. ఈ కేసులోని బాధితురాలు లక్ష్మి సోమవారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. ప్రకాశ్‌ తన నుంచి 30 తులాల బంగారం, రూ.10 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు మోపిన అభియోగంలో నిజం లేదని స్పష్టంచేశారు. కానిస్టేబుల్‌ తనను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, కక్ష సాధింపులో భాగంగానే తనను అడ్డం పెట్టుకుని ఆయనను డిస్మిస్‌ చేశారని వాపోయారు.

తప్పుడు స్టేట్‌మెంట్‌ రాయించారు; ‘నా భర్త, అతని కుటుంబసభ్యులు నన్ను వేధిస్తున్నారని నాలుగేళ్ల కిందట గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అక్కడ న్యాయం జరగకపోవడంతో 2019లో ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వెళ్లాను అక్కడున్న సీఎం వలీ అనే కానిస్టేబుల్‌ నా ఫిర్యాదు రాస్తానని చెప్పి, నేను నా భర్త వేధింపుల గురించి చెప్తే ఆయన మరోలా రాశారు. కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ నన్ను వేధిస్తున్నట్లు, అత్యాచారం చేసినట్లు, నా నుంచి డబ్బు, బంగారం తీసుకుని మోసం చేసినట్లుగా రాశారు.

ఎస్పీ వెళ్లిపోతున్నారని తొందరపెట్టి స్టేట్‌మెంట్‌ చదివే అవకాశం ఇవ్వకుండానే నాతో సంతకం చేయించుకున్నారు. దాని ఆధారంగానే కేసు నమోదుచేసి, అప్పటి డీఎస్పీ వీరరాఘవరెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టారు. కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ నాపై అత్యాచారం చేసినట్లు మీడియాతో చెప్పారు. డీఎస్పీ ప్రెస్‌మీట్‌లో చెప్పింది తప్పు అని అప్పట్లోనే నేను టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేశాను. సీఐ జాకీర్‌ ఫిర్యాదు తీసుకోకుండా, విషయాన్ని కోర్టులో తేల్చుకోవాలన్నారు. నేను కోర్టును ఆశ్రయించి డీఎస్పీకి లీగల్‌ నోటీసులు ఇప్పించాను. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఇవేమీ పట్టించుకోకుండా నన్ను బూచిగా చూపించి ప్రకాశ్‌ను డిస్మిస్‌ చేయడం అన్యాయం.

డీఎస్పీ మా కుటుంబ పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించారు. ఇప్పుడు నా భర్త, పోలీసుల నుంచి మాకు ప్రాణహాని ఉంది. ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత’ అని లక్ష్మి ఆవేదన చెందారు. ‘నా భర్త వేధింపులు తాళలేక ఎన్నోసార్లు గార్లదిన్నె పోలీసులు, జిల్లా ఎస్పీని ఆశ్రయించాను. స్పందనకు హాజరైనప్పుడు ప్రకాశ్‌ పరిచయమయ్యారు. కేసులో నాకు సహకరించారు. అప్పటికే అతనిపై కక్ష పెంచుకున్న ఉన్నతాధికారులు మా మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు చిత్రీకరించారు. కానిస్టేబుల్‌ సీఎం వలీ, డీఎస్పీ వీరరాఘవరెడ్డి ఈ దుష్ప్రచారం చేశారని’ ఆమె ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.