ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు@3pm

.

author img

By

Published : Nov 4, 2022, 2:58 PM IST

3pm topnews
ప్రధానవార్తలు3pm
  • గొంతులో ఆమ్లెట్​ ఇరుక్కుని వ్యక్తి మృతి..

గొంతులో ఆమ్లెట్​ ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా, జరిగిన తతంగం వింటే.. మీరు కూడా ముక్కుమీద వేలేసుకుంటారు. తెలంగాణ జనగామ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై.. పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో ఏం తేలుతుందోనని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అవినీతికి పాల్పడిన అకౌంటెంట్ సస్పెండ్..

అవినీతికి పాల్పడిన గుంటూరు నగరపాలక సంస్థ అకౌంటెంట్ సిరిల్ పాల్​ను కమిషనర్ చేకూరి కీర్తి సస్పెండ్ చేశారు. గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లులను తెలివిగా అకౌంటెంట్ సిరిల్ పాల్ తన సొంత ఖాతాల్లోకి మళ్ళించుకుని.. మొత్తం రూ.47 లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు తెలిపారు. బిల్లులు అందని గుత్తేదారు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పేదల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చే వారికి కాంట్రాక్టు ఇస్తాం.. అజేయ్ జైన్

పేదలందరికీ ఇళ్లు పథకంలో బాగంగా ఇళ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కర్నూలులో అన్నారు. ఈ పథకానికి 35వేల కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలని సీఎం కోరారన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కందుకూరి వీరేశలింగం.. హితకారిణి సమాజం భూములపైన సర్కారు కన్ను!

సమాజహితం కోసం తమ జీవితాలనే పణంగా పెట్టిన త్యాగధనుల ఆస్తులపైనా వైకాపా సర్కార్ కన్నుపడింది. సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం యావదాస్తి ధారపోసి స్థాపించిన హితకారిణి సమాజం భూముల స్వాధీనానికి పావులు కదపుతోంది. ఎయిడెడ్ విద్యాసంస్థల స్వాధీనం పేరిట రాజమహేంద్రవరంలోని 200 కోట్ల విలువైన హితకారిణి సమాజం భూములను లాగేసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గుజరాత్​లో ఆప్ సీఎం అభ్యర్థిగా ఈశుదాన్ గఢ్వీ

గుజరాత్​ ఎన్నికల్లో​ ఆమ్​ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈశుదాన్ గఢ్వీ ఎంపికయ్యారు. ఈ మేరకు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇళ్ల మధ్యలోకి వచ్చి బీభత్సం సృష్టించిన చిరుత

కర్ణాటకలో ఓ చిరుతపులి జనావాసాల్లోకి వచ్చి కొందరిపై దాడి చేసింది. శుక్రవారం ఉదయం మైసూర్​ జిల్లాలోని కేఆర్​ నగర్​ ప్రాంతం శివార్లలో ఉన్న కనక నగర్​లో ఓ చిరుత ప్రజలను పరుగులు పెట్టించింది. ముళ్లూరు రోడ్డు సమీపంలో ఉన్న రాజా ప్రకాష్ స్కూల్ రోడ్డులో ఓ వ్యక్తి బైక్​పై వెళ్తుండగా అతనిపై దాడి చేసింది. ఆ తరువాత మరో ఇద్దరిపై దాడి చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భూమిపై పడనున్న 23 టన్నుల రాకెట్ శిథిలాలు.. ప్రమాదమెంత?

అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ను నిర్మిస్తోన్న చైనా.. ఇటీవల అందుకు అవసరమైన చివరి మాడ్యూల్‌ను గత సోమవారం భారీ రాకెట్‌లో పంపించింది. ఆ రాకెట్‌ ఇప్పుడు తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. ఆ సమయంలో భూమిపై 23 టన్నుల రాకెట్‌ శిథిలాలు పడనున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోతే ఏం చేయాలి?

ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాలలో చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయి.. నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అదే సమస్య భారతదేశంలో తలెత్తితే.. ముందుగా ఎలా సిద్ధమవ్వాలో తెలుసుకుందాం! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐర్లాండ్​పై ఘన విజయం.. సెమీస్​ చేరిన తొలి జట్టుగా న్యూజిలాండ్​

టీ20 ప్రపంచకప్‌ 2022లో సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకొన్న తొలి జట్టుగా న్యూజిలాండ్‌ అవతరించింది. తాజాగా జరిగిన మ్యాచ్​లో ఐర్లాండ్​పై విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ విషయంలో వంటలక్క ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటుందట

ప్రేమి విశ్వనాథ్​ ఈ పేరుకు తెలుగు బుల్లితెరపై ఉన్న క్రేజే వేరు. కార్తీకదీపం సీరియల్​లో తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ నటి హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్​ను సంపాదించుకుంది. ఇప్పటివరకు ఆ సీరియల్​లో తప్ప ఇంకెక్కడ ఆమె కనపడలేదు. అయితే తాజాగా తొలిసారి ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గొంతులో ఆమ్లెట్​ ఇరుక్కుని వ్యక్తి మృతి..

గొంతులో ఆమ్లెట్​ ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా, జరిగిన తతంగం వింటే.. మీరు కూడా ముక్కుమీద వేలేసుకుంటారు. తెలంగాణ జనగామ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై.. పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో ఏం తేలుతుందోనని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అవినీతికి పాల్పడిన అకౌంటెంట్ సస్పెండ్..

అవినీతికి పాల్పడిన గుంటూరు నగరపాలక సంస్థ అకౌంటెంట్ సిరిల్ పాల్​ను కమిషనర్ చేకూరి కీర్తి సస్పెండ్ చేశారు. గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లులను తెలివిగా అకౌంటెంట్ సిరిల్ పాల్ తన సొంత ఖాతాల్లోకి మళ్ళించుకుని.. మొత్తం రూ.47 లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు తెలిపారు. బిల్లులు అందని గుత్తేదారు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పేదల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చే వారికి కాంట్రాక్టు ఇస్తాం.. అజేయ్ జైన్

పేదలందరికీ ఇళ్లు పథకంలో బాగంగా ఇళ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కర్నూలులో అన్నారు. ఈ పథకానికి 35వేల కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలని సీఎం కోరారన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కందుకూరి వీరేశలింగం.. హితకారిణి సమాజం భూములపైన సర్కారు కన్ను!

సమాజహితం కోసం తమ జీవితాలనే పణంగా పెట్టిన త్యాగధనుల ఆస్తులపైనా వైకాపా సర్కార్ కన్నుపడింది. సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం యావదాస్తి ధారపోసి స్థాపించిన హితకారిణి సమాజం భూముల స్వాధీనానికి పావులు కదపుతోంది. ఎయిడెడ్ విద్యాసంస్థల స్వాధీనం పేరిట రాజమహేంద్రవరంలోని 200 కోట్ల విలువైన హితకారిణి సమాజం భూములను లాగేసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గుజరాత్​లో ఆప్ సీఎం అభ్యర్థిగా ఈశుదాన్ గఢ్వీ

గుజరాత్​ ఎన్నికల్లో​ ఆమ్​ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈశుదాన్ గఢ్వీ ఎంపికయ్యారు. ఈ మేరకు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇళ్ల మధ్యలోకి వచ్చి బీభత్సం సృష్టించిన చిరుత

కర్ణాటకలో ఓ చిరుతపులి జనావాసాల్లోకి వచ్చి కొందరిపై దాడి చేసింది. శుక్రవారం ఉదయం మైసూర్​ జిల్లాలోని కేఆర్​ నగర్​ ప్రాంతం శివార్లలో ఉన్న కనక నగర్​లో ఓ చిరుత ప్రజలను పరుగులు పెట్టించింది. ముళ్లూరు రోడ్డు సమీపంలో ఉన్న రాజా ప్రకాష్ స్కూల్ రోడ్డులో ఓ వ్యక్తి బైక్​పై వెళ్తుండగా అతనిపై దాడి చేసింది. ఆ తరువాత మరో ఇద్దరిపై దాడి చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భూమిపై పడనున్న 23 టన్నుల రాకెట్ శిథిలాలు.. ప్రమాదమెంత?

అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ను నిర్మిస్తోన్న చైనా.. ఇటీవల అందుకు అవసరమైన చివరి మాడ్యూల్‌ను గత సోమవారం భారీ రాకెట్‌లో పంపించింది. ఆ రాకెట్‌ ఇప్పుడు తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. ఆ సమయంలో భూమిపై 23 టన్నుల రాకెట్‌ శిథిలాలు పడనున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోతే ఏం చేయాలి?

ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాలలో చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయి.. నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అదే సమస్య భారతదేశంలో తలెత్తితే.. ముందుగా ఎలా సిద్ధమవ్వాలో తెలుసుకుందాం! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐర్లాండ్​పై ఘన విజయం.. సెమీస్​ చేరిన తొలి జట్టుగా న్యూజిలాండ్​

టీ20 ప్రపంచకప్‌ 2022లో సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకొన్న తొలి జట్టుగా న్యూజిలాండ్‌ అవతరించింది. తాజాగా జరిగిన మ్యాచ్​లో ఐర్లాండ్​పై విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ విషయంలో వంటలక్క ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటుందట

ప్రేమి విశ్వనాథ్​ ఈ పేరుకు తెలుగు బుల్లితెరపై ఉన్న క్రేజే వేరు. కార్తీకదీపం సీరియల్​లో తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ నటి హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్​ను సంపాదించుకుంది. ఇప్పటివరకు ఆ సీరియల్​లో తప్ప ఇంకెక్కడ ఆమె కనపడలేదు. అయితే తాజాగా తొలిసారి ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.