ఏపీ లాసెట్ ఫలితాలను అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో డైరక్టర్ అండ్ రిజస్టర్ కృష్ణనాయక్ విడుదల చేశారు. లాసెట్ కోసం 18,371 మంది దరఖాస్తు చేసుకోగా 66.72 మంది పరీక్షకు హాజరైనట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహించమన్నారు. లాసెట్ కు సంబంధించి మూడు విభాగాల్లో 91.39 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు.
2019 తో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారని.. కృష్ణనాయక్ తెలిపారు. దీన్ని బట్టి న్యాయవిద్య అభ్యసించేందుకు చాలా మంది ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి