Tiger wandering in kotauratla Mandal: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం టీ.జగ్గంపేట శివారు తాడిపత్రి- శ్రీరాంపురం గ్రామ సమీపంలోని జీడిమామిడి తోటలో పెద్ద పులి జాడ కనిపించింది. శ్రీరాంపురం గ్రామానికి చెందిన చిన్న అనే రైతు పాడి గేదెపై పులి పంజా విసిరింది. అనంతరం పక్కనే ఉన్న పెద్ద కొండ పైకి వెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న నర్సీపట్నం ఫారెస్ట్ అధికారులు.. పులి సంచరిస్తున్న ప్రదేశాన్ని గుర్తించే పనిలో పడ్డారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
![Tiger wandering in kotauratla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-akp-21-29-akp-forst-entree-tiger-ap10149_29062022144515_2906f_1656494115_512.jpg)
ఇదీ చదవండి: