అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలోని ఆదివాసీ గ్రామమైన శబరి కొత్తగూడెంలోని 70 శాతం గుడిసెలు వరద ధాటికి కూలిపోయాయి. కనీసం మొండి గోడలూ మిగల్లేదు. ఇళ్ల పైకప్పులు మాత్రం కొద్ది దూరం కొట్టుకుపోయాయి. సుమారు నెల రోజులుగా గ్రామ ప్రజలంతా చినార్కూరు ప్రధాన, అంతర్గత దారుల పక్కన గుడారాలు వేసుకొని ఉంటున్నారు. ప్రస్తుతం గోదావరి శాంతించడంతో గ్రామానికి వెళ్లి చూసుకున్నారు. గ్రామాన్ని తిరిగి ఓ రూపునకు తీసుకురావాలంటే కనీసం 3 నెలలు పడుతుందని, అదీ అటవీశాఖ అధికారులు సహకరిస్తేనే సాధ్యమవుతుందని బాధితులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: