ETV Bharat / sports

కడపలో ట్రిపుల్ సెంచరీ చేసిన టెండూల్కర్

కడపలో టెండూల్కర్ బ్యాటింగ్​కు దిగాడు.. ఫోర్లు.. సిక్సర్లతో దుమ్మురేపాడు.. ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదేశాడు... అదేంటీ.. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరైన మాస్టర్ బ్లాస్టర్ మళ్లీ బ్యాట్ ఎప్పుడు పట్టాడు అనుకుంటున్నారా.. ? అది కూడా కడపలో ఎందుకు బ్యాటింగ్ చేశాడు అని కన్ఫ్యూజ్ అవుతున్నారా..? అయితే మీరు ఈ టెండూల్కర్ గురించి తెలుసుకోవలసిందే.. !

author img

By

Published : Aug 2, 2019, 6:33 AM IST

టెండూల్కర్
కడపలో ట్రిపుల్ సెంచరీ చేసిన టెండూల్కర్

మాస్టర్ బ్లాస్టర్... సచిన్ టెండూల్కర్... ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. క్రికెట్ దేవుడిగా పిలిచే సచిన్ టెండూల్కర్ ను అభిమానించే వీరాభిమానులు దేశంలో కోకొల్లలు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ వీరాభిమాని తన కుమారుడికి సచిన్ పేరు కలిసేలా.. "అర్జున్ టెండూల్కర్" పేరు పెట్టుకున్నాడు. అంత పెద్ద ప్లేయర్ పేరు పెట్టుకున్న అర్జున్.. ఆ పేరు నిలిపాడు. సచిన్​లా చిన్న వయసులోనే.. పరుగుల మోత మోగిస్తున్నాడు. కడపలో జరుగుతున్న అండర్-16 క్రికెట్ మ్యాచ్ లో కడప జట్టుపై ట్రిపుల్ సెంచరీ బాదేశాడు.

చిన్న వయసు నుంచే..

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన అర్జున్.. నాలుగేళ్ల వయసులోనే బ్యాట్ పట్టాడు. తన తండ్రి ఆదినారాయణ.. సచిన్ మీద అభిమానంతో తన కుమారుడికి.. అర్జున్ టెండూల్కర్ అని పేరు పెట్టుకున్నాడు. సచిన్ కుమారుడి పేరు కూడా అర్జునే..! తమ గ్రామంలో క్రికెట్ ఆడటానికి సరైన మైదానం లేని పరిస్థితుల్లో.. అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అర్జున్ టెండూల్కర్ కోసమే కుటుంబం గొట్లూరు నుంచి అనంతపురానికి మకాం మార్చారు. నిరంతర సాధన చేస్తున్న అర్జున్... ఆడుతున్న ప్రతి మ్యాచ్ లోనూ మెరుగైన స్కోరు సాధిస్తున్నాడు. ప్రస్తుతం కడప కేఓఆర్ఎం కళాశాల మైదానంలో జరుగుతున్న అండర్-16 అంతర్ జిల్లాల క్రికెట్ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరు కనబరిచాడు.

ట్రిపుల్ సెంచరీతో...

అనంతపురం - కడప జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 215 బంతుల్లో 39 ఫోర్లు, 13 సిక్సులతో 308 పరుగులు చేశారు. ఓవర్ నైట్ స్కోరు 391 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన అనంతపురం జట్టు... 134 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 618 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన కడప జట్టు 42.2 ఓవర్ల లో 134 పరుగులకే కుప్పకూలింది. ఫాలోఆన్ లో రెండో ఇన్నింగ్స్ ఆడుతూ...86 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతపురం జట్టు ఇన్నింగ్స్ 399 పరుగుల తేడాతో విజయం సాధించింది. కిందటి ఏడాది ఇదే మైదానంలో అండర్ -14 విభాగంలోనూ అర్జున్ చెండూల్కర్.. డబుల్ సెంచరీ, సెంచరీ నమోదు చేశాడు.

కుటుంబమంతా ప్లేయర్లే ..

చేనేత కుటుంబానికి చెందిన ఆదినారాయణ, పార్వతి దంపతుల నలుగురి సంతానంలో ముగ్గురు క్రికెట్ ప్లేయర్లే. పెద్ద కుమార్తె లీలావతి మినహా.... అర్జున్ టెండూల్కర్ సోదరి పల్లవి క్రికెట్ స్టేట్ ప్లేయర్ కాగా.... తమ్ముడు మణిదీప్ అండర్-14 ఆడుతున్నాడు. అర్జున్ ఇప్పటివరకూ అండర్-12, అండర్-14, అండర్-16, అండర్-19 విభాగాల్లో రాణించాడు. చేనేత కుటుంబానికి చెందిన తన తండ్రి... క్రికెట్​పై మక్కువతోనే ప్రోత్సహిస్తున్నారని... కుటుంబ పోషణ భారమైనా.... తమను మంచి క్రికెటర్ గా చూడాలనే కోరికతో తాము అడిగిన బ్యాట్లు, కిట్లు కొనిస్తున్నారని అర్జున్ చెబుతున్నాడు. తండ్రి ఆశయాన్ని నిలెబట్టి, ఎప్పటికైనా టీమిండియాకు ఆడాలన్నదే తన లక్ష్యమని అర్జున్ అంటున్నారు. సచిన్ తరహాలో చిన్న వయసులోనే అదరగొడుతున్న అర్జున్ టెండూల్కర్.. సచిన్ అంత గొప్ప ప్లేయర్ కావాలని అంతా ఆశిస్తున్నారు.

కడపలో ట్రిపుల్ సెంచరీ చేసిన టెండూల్కర్

మాస్టర్ బ్లాస్టర్... సచిన్ టెండూల్కర్... ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. క్రికెట్ దేవుడిగా పిలిచే సచిన్ టెండూల్కర్ ను అభిమానించే వీరాభిమానులు దేశంలో కోకొల్లలు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ వీరాభిమాని తన కుమారుడికి సచిన్ పేరు కలిసేలా.. "అర్జున్ టెండూల్కర్" పేరు పెట్టుకున్నాడు. అంత పెద్ద ప్లేయర్ పేరు పెట్టుకున్న అర్జున్.. ఆ పేరు నిలిపాడు. సచిన్​లా చిన్న వయసులోనే.. పరుగుల మోత మోగిస్తున్నాడు. కడపలో జరుగుతున్న అండర్-16 క్రికెట్ మ్యాచ్ లో కడప జట్టుపై ట్రిపుల్ సెంచరీ బాదేశాడు.

చిన్న వయసు నుంచే..

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన అర్జున్.. నాలుగేళ్ల వయసులోనే బ్యాట్ పట్టాడు. తన తండ్రి ఆదినారాయణ.. సచిన్ మీద అభిమానంతో తన కుమారుడికి.. అర్జున్ టెండూల్కర్ అని పేరు పెట్టుకున్నాడు. సచిన్ కుమారుడి పేరు కూడా అర్జునే..! తమ గ్రామంలో క్రికెట్ ఆడటానికి సరైన మైదానం లేని పరిస్థితుల్లో.. అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అర్జున్ టెండూల్కర్ కోసమే కుటుంబం గొట్లూరు నుంచి అనంతపురానికి మకాం మార్చారు. నిరంతర సాధన చేస్తున్న అర్జున్... ఆడుతున్న ప్రతి మ్యాచ్ లోనూ మెరుగైన స్కోరు సాధిస్తున్నాడు. ప్రస్తుతం కడప కేఓఆర్ఎం కళాశాల మైదానంలో జరుగుతున్న అండర్-16 అంతర్ జిల్లాల క్రికెట్ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరు కనబరిచాడు.

ట్రిపుల్ సెంచరీతో...

అనంతపురం - కడప జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 215 బంతుల్లో 39 ఫోర్లు, 13 సిక్సులతో 308 పరుగులు చేశారు. ఓవర్ నైట్ స్కోరు 391 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన అనంతపురం జట్టు... 134 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 618 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన కడప జట్టు 42.2 ఓవర్ల లో 134 పరుగులకే కుప్పకూలింది. ఫాలోఆన్ లో రెండో ఇన్నింగ్స్ ఆడుతూ...86 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతపురం జట్టు ఇన్నింగ్స్ 399 పరుగుల తేడాతో విజయం సాధించింది. కిందటి ఏడాది ఇదే మైదానంలో అండర్ -14 విభాగంలోనూ అర్జున్ చెండూల్కర్.. డబుల్ సెంచరీ, సెంచరీ నమోదు చేశాడు.

కుటుంబమంతా ప్లేయర్లే ..

చేనేత కుటుంబానికి చెందిన ఆదినారాయణ, పార్వతి దంపతుల నలుగురి సంతానంలో ముగ్గురు క్రికెట్ ప్లేయర్లే. పెద్ద కుమార్తె లీలావతి మినహా.... అర్జున్ టెండూల్కర్ సోదరి పల్లవి క్రికెట్ స్టేట్ ప్లేయర్ కాగా.... తమ్ముడు మణిదీప్ అండర్-14 ఆడుతున్నాడు. అర్జున్ ఇప్పటివరకూ అండర్-12, అండర్-14, అండర్-16, అండర్-19 విభాగాల్లో రాణించాడు. చేనేత కుటుంబానికి చెందిన తన తండ్రి... క్రికెట్​పై మక్కువతోనే ప్రోత్సహిస్తున్నారని... కుటుంబ పోషణ భారమైనా.... తమను మంచి క్రికెటర్ గా చూడాలనే కోరికతో తాము అడిగిన బ్యాట్లు, కిట్లు కొనిస్తున్నారని అర్జున్ చెబుతున్నాడు. తండ్రి ఆశయాన్ని నిలెబట్టి, ఎప్పటికైనా టీమిండియాకు ఆడాలన్నదే తన లక్ష్యమని అర్జున్ అంటున్నారు. సచిన్ తరహాలో చిన్న వయసులోనే అదరగొడుతున్న అర్జున్ టెండూల్కర్.. సచిన్ అంత గొప్ప ప్లేయర్ కావాలని అంతా ఆశిస్తున్నారు.

Intro:kit 736

అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511

కృష్ణా జిల్లా, లక్ష్మీపురం లో ఉన్న కేసిపి చక్కెర కర్మాగారం ముందు కార్మికులు గత 4 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు.

2019 సంవత్సరంలో లక్ష్మీపురం కర్మాగారంలో చెరకు క్రషింగ్ నిలిపివేయడం లో భాగంగానే ఫ్యాక్టరీ లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను విధులకు రావద్దని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలియజేయడంతో లక్ష్మీ పురం లో బ్యాటరీ ముందు గత నాలుగు రోజులనుండి రోడ్డు పక్కన కూర్చుని ఆందోళన నిర్వహిస్తున్నారు.

గత నాలుగు రోజుల నుండి ఆందోళన చేస్తున్నప్పటికీ స్థానిక నాయకులు గానీ ఫ్యాక్టరీ యాజమాన్యం గానీ ఏ విధంగానూ స్పందించడం లేదని కార్మికులు వాపోతున్నారు గత 20 సంవత్సరాలుగా ఫ్యాక్టరీ లో పని చేస్తూ ఉన్నపళంగా తమను తొలగించడంపై భార్య పిల్లలు రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

దివిసీమలో ఉన్న ఏకైక అతిపెద్ద ఫ్యాక్టరీ చక్కెర కర్మాగారం కావడంతో ఈ కర్మాగారం ఇప్పుడు మూసి వేస్తున్నారని ఊహాగానాలు రావడంతో చెరుకు రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు.

వాయిస్ బైట్స్
కార్మికులు
స్థానిక నాయకులు





Body:లక్ష్మీపురం చక్కెర కర్మాగారం ముందు కార్మికుల ఆందోళన


Conclusion:లక్ష్మీపురం చక్కెర కర్మాగారం ముందు కార్మికుల ఆందోళన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.