LIVE: టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశం- ప్రత్యక్ష ప్రసారం - TDP Varla Ramiaha Live
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 1:09 PM IST
|Updated : Jan 9, 2024, 1:39 PM IST
TDP Leader Varla Ramiaha Media Conference Live: జగన్ సర్కార్ ఏపీని ఉద్యమాంధ్రాగా మార్చారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. గత కొన్ని రోజులుగా కార్మికులు ఆందోళనలు చేపడుతుంటే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించటంపై నిరాకరించటంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. పైగా కార్మికులకు వేతనాలు పెంచడానికి డబ్బులు లేవంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. విశాఖలో విలాసవంతమైన సీఎం క్యాంపు కార్యాలయం నిర్మించుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
కార్మికులు చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని ఎలా పోషిస్తారని మండిపడ్డారు. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్యాలస్ల ప్రకటనలకు చేసే దుబారా ఖర్చంత చెయ్యదు ఆందోళన చేస్తున్న వివిధ వర్గాల డిమాండ్ల విలువ అని అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.