ETV Bharat / lifestyle

గ్రీటింగు కార్డులమ్మి చదువుకున్నాడు... లూడో కింగ్​ అయ్యాడు​..!

author img

By

Published : Nov 2, 2020, 12:34 AM IST

చదువును పక్కన పెట్టి... వీడియో గేములంటూ పార్లర్లలోనే కాలక్షేపం చేస్తూ... అమ్మ పెట్టే చీవాట్లు తింటూ పెరిగాడు వికాస్‌ జైశ్వాల్‌. ఆ ఇష్టంతోనే ఎన్ని ఆర్థిక సమస్యలు ఎదురైనా అలాంటి ఆటల్ని సృష్టించాలని చిన్నవయసు నుంచే కలలు కన్నాడు. ఒకప్పుడు పట్నాలో సాదాసీదాగా ప్రయాణం మొదలుపెట్టి నేడు లూడో కింగ్‌ గేముతో ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల మందికి చేరువయ్యాడు. మన దేశంలో నంబర్‌వన్‌ గేమ్‌ సృష్టికర్తగా నిలిచిన వికాస్‌ జీవితం ఆయన మాటల్లోనే...

గ్రీటింగు కార్డులమ్మి చదువుకున్నాడు... లూడో కింగ్​ అయ్యాడు​..!
గ్రీటింగు కార్డులమ్మి చదువుకున్నాడు... లూడో కింగ్​ అయ్యాడు​..!

ఇంటిల్లిపాదీ ఖాళీగా ఉన్నప్పుడూ, బామ్మా తాతలకు బోరు కొట్టినప్పుడూ, షూటింగ్‌ విరామంలో నటీనటులకు సమయం చిక్కినప్పుడూ... ఇలా చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ చేసే పని లూడో కింగ్‌ ఆడటం. లాక్‌డౌన్‌ వేళ దాదాపు ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరి ఫోన్‌లో లూడో తిష్ట వేసి కాలక్షేపం అయ్యేలా చేసింది. అంతేకాదు అప్పటివరకూ దీని నిర్వహణకు మాకు రెండు సర్వర్లు సరిపోయేవి. లాక్‌డౌన్‌ వేళ ఒక్కసారిగా డౌన్‌లోడ్లు ఊపందుకుని అవి క్రాష్‌ అవ్వడం మొదలైంది. దాంతో ఒక్కోటిగా ఆ సంఖ్యను పెంచుకుంటూ రెండు వందల సర్వర్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో మా టీం సభ్యులం ఇళ్లకు కూడా వెళ్లకుండానే ఆఫీసులోనే ఉండి సర్వర్లు క్రాష్‌ అవ్వకుండా చూసుకున్నాం. అదంతా చూశాక లూడో కింగ్‌ తప్పకుండా మనదేశంలో నంబర్‌వన్‌ గేమ్‌ అవుతుందని అర్థమైంది. అనుకున్నట్టుగానే 46కోట్లకుపైనే డౌన్‌లోడ్లతో నన్ను విజయాల బాట పట్టించింది. నిజానికి నేను ఆ స్థాయికి చేరుకోవాలని ఎన్నో కలలు కన్నా. మరెన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఇప్పుడు ప్రతిరోజూ పడుకునే ముందు అవన్నీ గుర్తుచేసుకుంటూ ఉంటా.

మాది పట్నాలోని పేద కుటుంబం. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ గృహిణి. నాకు రెండేళ్లు వచ్చే వరకూ ఎలాంటి సమస్యలూ లేవు. మా ఇల్లు ఎప్పుడూ బంధువులతో కళకళలాడుతుండేది. కానీ ప్రమాదవశాత్తూ నాన్న చనిపోయాక ఆ కళా, బంధువుల రాకా తగ్గిపోయాయి. ఒక్కసారిగా ఆర్థిక సమస్యలూ చుట్టుముట్టాయి. అమ్మ పెద్దగా చదువుకోలేదు. బయటకు వెళ్లడం కూడా తెలీదు. అన్నయ్యా, నేనూ చిన్న పిల్లలం. ఒంటరిదైన అమ్మను మా బంధువులు కూడా చేరదీయలేదు. సొంత ఇల్లు కూడా లేని మేము అద్దె తగ్గించుకోవాలని రెండు గదుల ఇంటికి మారాం. నాన్న పెన్షన్‌ డబ్బులతోనే అమ్మ మమ్మల్ని పెంచడం మొదలుపెట్టింది. నిజానికి చిన్నతనంలో నేను బాధ్యత లేకుండా పెరిగా. ఇంటి సమస్యలేవీ పట్టేవి కాదు. అన్నయ్యా, అమ్మా అన్నీ చూసుకుంటారులే అనుకునేవాడిని. ఎప్పుడూ స్నేహితులతోనే కాలక్షేపం. చదువు కూడా పెద్దగా ఎక్కేది కాదు. స్కూల్‌ అయ్యాక ఇంటికి వెళ్లకుండా ఫ్రెండ్స్‌తో కలిసి నేరుగా గేమింగ్‌ పార్లర్లకు వెళ్లేవాడిని. పాకెట్‌మనీ అంతా అక్కడే ఖర్చయ్యేది. చేతిలో ఎక్కువ డబ్బులుంటే స్కూలు కూడా మానేసి ఆ పార్లర్‌లోనే గంటలు గంటలు గడిపేవాడిని. వాటిని ఖర్చు పెట్టేముందు ఇంటి గురించి ఒక్కక్షణం కూడా ఆలోచించేవాడిని కాదు. కానీ మా అమ్మ ఇంట్లో ఇరవై నాలుగ్గంటలూ నా గురించే ఆలోచించి బాధపడేది. నేను ఏమైపోతానో, నా భవిష్యత్తు ఎటువెళుతుందోననీ కుంగిపోయేది. ఆ ఆందోళనతోనే ఇంట్లో ఉన్నంతసేపూ తిడుతూనే ఉండేది. అయినా అవేమీ నేను పట్టించుకునేవాడిని కాదు. అయితే ఇంటర్‌కి వచ్చాక కొన్ని కారణాల వల్ల బిహార్‌ ప్రభుత్వం గేమింగ్‌ పార్లర్లను మూసివేయించింది. ఆ విషయం తెలిసి ఎంత బాధపడ్డానో. ఒకరకంగా డిప్రెషన్‌లోకి వెళ్లానని చెప్పాలి. నిజానికి ఆ నిర్ణయం నా జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. ఎందుకంటే ఆడుకోవడానికి వీలులేక ఎప్పటికైనా అలాంటి గేముల్ని రూపొందించాలనే ఆలోచన కలిగింది. అదే సమయంలో ఇంటి గురించీ ఆలోచించే సమయం దొరికింది. స్నేహితులూ, వ్యాపకాలూ తగ్గిపోయాయి. అమ్మా, అన్నయ్యలకి దగ్గరయ్యా. చాలీచాలని డబ్బుతో అమ్మ పొదుపుగా ఇంటిని నెట్టుకురావడం, తనకోసం ఏమీ ఖర్చు పెట్టుకోకుండా మా కోసం త్యాగాలు చేయడం స్వయంగా చూశా. డబ్బులు వృథా చేసి అమ్మని కష్టపెట్టినందుకు ఎంతో బాధనిపించింది. అప్పట్నుంచీ తనని ఇబ్బంది పెట్టకూడదనీ, బాగా డబ్బు సంపాదించి అమ్మ కోరుకున్నవన్నీ ఇవ్వాలనీ గట్టిగా నిర్ణయించుకున్నా.

అమ్మ నగలమ్మింది...
ఆ తరవాత అతికష్టం మీద చదువుపైన శ్రద్ధ పెట్టా. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ మంచి మార్కులతో పాసయ్యా. ఆ తరవాత ఏం చదవాలీ అని ఆలోచిస్తున్నప్పుడు ఐటీ ఉద్యోగులకు బాగా జీతం వస్తుందని తెలిసింది. పైగా ఆ చదువుతో గేముల్ని కూడా రూపొందించొచ్చని స్నేహితులు చెప్పారు. దాంతో ఎలాగైనా బీటెక్‌ చదవాలనిపించింది. కానీ ఆ రోజుల్లో బీటెక్‌ ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. పైగా అమ్మకి చదివించే స్థోమత లేదు. అన్నయ్య కూడా చదువుకుంటున్నాడు. ఎలాగోలా చదువుకి డబ్బులు కూడబెట్టుకోవడం మంచిదని వెంటనే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయలేదు. ఇంట్లో కూర్చుని చదువుకుంటూనే నాకెంతో ఇష్టమైన గ్రీటింగు కార్డుల్ని తయారు చేసి వాటిని స్థానిక స్టేషనరీ షాపుల్లో అమ్మడం మొదలుపెట్టా. అలానే రెండుమూడు షాపుల్లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం కూడా చేసి డబ్బులు సంపాదించేవాడిని. నేను అలా బాధ్యతగా ఉండటం అమ్మకి సంతోషంగా అనిపించినా... మరోవైపు నేను పడుతున్న కష్టం చూసి తట్టుకోలేకపోయింది. అందుకే నేను దాచుకున్న డబ్బుకు తోడు కొంత అప్పు చేసి ఇంజినీరింగు ప్రవేశ పరీక్ష రాయమని ప్రోత్సహించింది. అలా కష్టపడిన నాకు 1999లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులందర్‌షాలో ఉన్న ‘మరాఠ్‌వాడా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’లో సీటు వచ్చింది. అమ్మ కష్టాన్ని వృథా చేయకూడదు అని నిర్ణయించుకుని హాస్టల్‌కి వెళ్లా. కొన్నాళ్లకి చదువుకితోడు కంప్యూటర్‌ కూడా ఉంటే ఇంకా బాగా చదవొచ్చని అర్థమైంది. కానీ అంత డబ్బు లేదు. ఒకసారి ఇంటికి వెళ్లినప్పుడు స్నేహితులతో అదే విషయం మాట్లాడుతుంటే అమ్మ విన్నది. పదిరోజుల తరవాత కాలేజీకి తిరిగి వెళుతుంటే తన దగ్గరున్న నగలు అమ్మి కంప్యూటర్‌ కొనుక్కోమని డబ్బులు చేతిలో పెట్టింది. అలా కంప్యూటర్‌ కొనుక్కున్న నేను దాన్ని నా గదిలో పెట్టుకుని ఎంతో అపురూపంగా చూసుకునేవాడిని. అమ్మ కష్టాలన్నీ కంప్యూటర్‌ రూపంలో కనిపించేవి. నా స్నేహితులంతా కంప్యూటర్‌ని పాటలూ, సినిమాలూ చూడ్డానికి వాడినా నేను మాత్రం చదువుకోవడానికే ఉపయోగించే వాడిని. అర్ధరాత్రి వరకూ మేల్కొని రకరకాల కంప్యూటర్‌ మ్యాగజైన్లు చదువుతూ సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుంటుండేవాడిని. దాంతో మా క్యాంపస్‌లో టెక్నికల్‌గా ఎవరికి ఏ సందేహం వచ్చినా నా దగ్గరకే వచ్చేవాళ్లు. బీటెక్‌ చివరి ఏడాదిలో ఉండగా తలా ఒక ప్రాజెక్టు చేయమన్నారు. అప్పుడు నేను నాకెంతో ఇష్టమైన గేమును ఒకదాన్ని రూపొందించి ‘ఎగ్గీబాయ్‌’ అనే పేరు పెట్టా. దానికి కాలేజీలో మంచి పేరు వచ్చింది. క్యాంపస్‌లో విద్యార్థులంతా అడిగి మరీ తమ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేయించుకుని ఆడుతుండేవారు. అంతేకాదు, ఓ ప్రముఖ కంప్యూటర్‌ మ్యాగజైన్‌ గేముతోపాటు నా గురించీ తమ పుస్తకంలో ప్రచురించింది. ఆ గుర్తింపు నాలో
తెలియని ఉత్సాహాన్ని నింపింది.

40 కిలోమీటర్లు నడిచే...
అక్కడితో ఆగిపోకుండా ఆ పత్రిక క్లిప్పింగును జోడించి ఓ రెజ్యుమే తయారు చేసుకున్నా. ఆ రోజుల్లో ఇంటర్నెట్‌ ఖరీదు ఎక్కువ. గంటకి వంద రూపాయలు తీసుకునేవారు. మా క్యాంపస్‌ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఓ నెట్‌ కెఫే ఉండేది. ప్రతి శనివారం కాలేజీ మానేసి నడుచుకుంటూ అక్కడకు వెళ్లేవాడిని. మనదేశంలోని పలు గేమింగ్‌ సంస్థల మెయిల్‌ ఐడీలు సంపాదించి నా రెజ్యుమే పంపి వారానికోసారి వెళ్లి చెక్‌ చేసుకునే వాడిని. అలా బీటెక్‌ పూర్తైన ఆరునెలలకి- అంటే 2004లో ముంబయికి చెందిన ఇండియాగేమ్‌ అనే సంస్థ నుంచి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. నా అర్హతల్నీ, కంప్యూటర్‌ పరిజ్ఞానాన్నీ చూసి గేమ్‌ డెవలపర్‌గా ఉద్యోగమిచ్చారు. అక్కడ పనిచేస్తూనే పలు కంప్యూటర్‌ వెబ్‌సైట్లకు గేమింగ్‌ గురించి కథనాలు రాసేవాడిని. నాలుగేళ్లు తిరిగే సరికి జీతం కంటే వెబ్‌సైట్ల ద్వారానే ఎక్కువ ఆదాయం వచ్చేది. అది చూసి నామీద నాకు నమ్మకం పెరిగింది. దాంతో 2008లో ఉద్యోగం మానేశా. ఇంటికోసం ఖర్చుపెట్టగా మిగిలిన రెండు లక్షలతో ముంబయిలోనే ఓ గదిని అద్దెకి తీసుకున్నా. ఓ నాలుగు కంప్యూటర్లు కొని ఇంజినీర్లూ, గ్రాఫిక్‌ డిజైనర్లను చేర్చుకుని ‘గేమేషన్‌ టెక్నాలజీస్‌’ పేరిట సంస్థను స్థాపించి కంప్యూటర్‌ గేములు రూపొందించడం మొదలుపెట్టా. ఈ ఆలోచన బాగా క్లిక్‌ అయింది. కొన్నాళ్ల తరవాత కీప్యాడ్‌ ఫోన్లు అందుబాటులోకి రావడంతో వాటికి అనుగుణంగా ¸ స్నేక్‌ అండ్‌ లేడర్‌, సుడొకు గేములు రూపొందించేవాళ్లం. కొంతకాలానికి స్మార్ట్‌ ఫోన్లు వచ్చాయి. టెక్నాలజీ అంటేనే కొత్తగా వచ్చే ప్రతి నైపుణ్యాన్నీ అందిపుచ్చుకోవాలి. అందుకు తగ్గట్టు వినియోగదారులకీ చేరువ కావాలి. కాబట్టి 2013లో ఆప్‌ ఆధారిత గేముల మీద దృష్టి పెట్టా. అప్పుడే చిన్నప్పుడు ఎక్కువగా ఆడిన లూడో బోర్డు గేము గుర్తొచ్చింది. దాన్ని ఆధునికీకరించి స్మార్ట్‌ గేమ్‌గా తీసుకొస్తే బాగుంటుందనిపించింది. పైగా ఆ పేరు కూడా అందరికీ తెలుసు, ఆట సులువుగా, పోటాపోటీగా ఉంటుంది. అందుకే మా బృందంలోని ఆరుగురు సభ్యులతో కలిసి కసరత్తు మొదలుపెట్టా. బోర్డు గేము నిబంధనలతోనే, టచ్‌ప్యాడ్‌కి అనుగుణంగా పలు ప్రయోగాలు చేస్తూ విఫలమవుతూ మళ్లీమళ్లీ ప్రయత్నిస్తూ... అలా లూడో గేముకి తుదిరూపం ఇవ్వడానికి మాకు మూడేళ్లు పట్టింది. ఈ ఆటను ఎంతదూరంలో ఉన్న వాళ్లతోనైనా ఆడుకునేలా రూపొందించా. ఒంటరిగా ఉన్నా... ఈ గేమ్‌తో బంధువులకీ, స్నేహితులకీ దగ్గరవ్వచ్చు. అందుకే కాబోలు మూడు నెలల్లో గూగుల్‌ ప్లే స్టోర్‌లో లూడో కింగ్‌ టాప్‌ బోర్డు గేముల్లో ఒకటిగా కనిపించడం మొదలైంది. ఏడాది తిరిగేసరికి 12 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ వచ్చి... లాక్‌డౌన్‌ పూర్తయ్యేసరికి 46కోట్లకుపైనే డౌన్‌లోడ్‌ మార్కును దాటేసి సరికొత్త రికార్డును సృష్టించింది. అలానే వార్షికాదాయం కూడా రూ.44.63 కోట్లకు చేరుకుంది. మూడేళ్లలో డౌన్‌లోడ్లు, ఆదాయం గ్రాఫ్‌ ఊహించని విధంగా పైపైకి వచ్చింది. ప్రస్తుతం నలుగురు మాత్రమే ఆడగలిగే ఈ గేమును త్వరలో ఆరుగురు ఆడేలా రూపొందిస్తున్నాం. వాట్సాప్‌ మాదిరి వీడియో చాటింగ్‌ ఏర్పాట్లూ చేస్తున్నాం. ప్రపంచ మార్కెట్‌ని ఆకర్షించడానికి ఆయా దేశాల్లోని పాపులర్‌ గేములకు అనుగుణంగా లూడో కింగ్‌ను వారికి దగ్గర చేస్తున్నాం. పట్టుదల, కృషి, అదృష్టం... ఏదైనా కానీ, అనుకున్నది సాధించినందుకూ, అమ్మ కోరికలన్నీ తీర్చగలిగినందుకూ మాత్రం చెప్పలేనంత సంతోషంగా ఉంది.

15 భాషలు

లూడో కింగ్‌తోపాటు స్నేక్‌ అండ్‌ లేడర్‌, సుడొకు బోర్డు గేముల్నీ తీసుకొచ్చాం. ప్రస్తుతం మా సంస్థలో ఎనభై మంది పనిచేస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలన్నీ నాభార్య సోనీ చూసుకుంటుంది. పబ్‌జీ, టెంపుల్‌రన్‌ వంటివాటిని అధిగమించిన అతిపెద్ద ఆసియా గేముగా లూడో కింగ్‌ నిలిచింది. ఈ గేముకు మనదేశంతోపాటు బంగ్లాదేశ్‌, ఇండోనేషియా, పాకిస్థాన్‌, స్పెయిన్‌, ఇటలీ, జర్మనీ, సౌదీ అరేబియా వంటి మరికొన్ని చోట్లా ఊహించని ఆదరణ లభించింది. లూడో కింగ్‌ ఆప్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో కలిపి దాదాపు 15 భాషలు అందుబాటులో ఉన్నాయి.

ఇంటిల్లిపాదీ ఖాళీగా ఉన్నప్పుడూ, బామ్మా తాతలకు బోరు కొట్టినప్పుడూ, షూటింగ్‌ విరామంలో నటీనటులకు సమయం చిక్కినప్పుడూ... ఇలా చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ చేసే పని లూడో కింగ్‌ ఆడటం. లాక్‌డౌన్‌ వేళ దాదాపు ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరి ఫోన్‌లో లూడో తిష్ట వేసి కాలక్షేపం అయ్యేలా చేసింది. అంతేకాదు అప్పటివరకూ దీని నిర్వహణకు మాకు రెండు సర్వర్లు సరిపోయేవి. లాక్‌డౌన్‌ వేళ ఒక్కసారిగా డౌన్‌లోడ్లు ఊపందుకుని అవి క్రాష్‌ అవ్వడం మొదలైంది. దాంతో ఒక్కోటిగా ఆ సంఖ్యను పెంచుకుంటూ రెండు వందల సర్వర్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో మా టీం సభ్యులం ఇళ్లకు కూడా వెళ్లకుండానే ఆఫీసులోనే ఉండి సర్వర్లు క్రాష్‌ అవ్వకుండా చూసుకున్నాం. అదంతా చూశాక లూడో కింగ్‌ తప్పకుండా మనదేశంలో నంబర్‌వన్‌ గేమ్‌ అవుతుందని అర్థమైంది. అనుకున్నట్టుగానే 46కోట్లకుపైనే డౌన్‌లోడ్లతో నన్ను విజయాల బాట పట్టించింది. నిజానికి నేను ఆ స్థాయికి చేరుకోవాలని ఎన్నో కలలు కన్నా. మరెన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఇప్పుడు ప్రతిరోజూ పడుకునే ముందు అవన్నీ గుర్తుచేసుకుంటూ ఉంటా.

మాది పట్నాలోని పేద కుటుంబం. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ గృహిణి. నాకు రెండేళ్లు వచ్చే వరకూ ఎలాంటి సమస్యలూ లేవు. మా ఇల్లు ఎప్పుడూ బంధువులతో కళకళలాడుతుండేది. కానీ ప్రమాదవశాత్తూ నాన్న చనిపోయాక ఆ కళా, బంధువుల రాకా తగ్గిపోయాయి. ఒక్కసారిగా ఆర్థిక సమస్యలూ చుట్టుముట్టాయి. అమ్మ పెద్దగా చదువుకోలేదు. బయటకు వెళ్లడం కూడా తెలీదు. అన్నయ్యా, నేనూ చిన్న పిల్లలం. ఒంటరిదైన అమ్మను మా బంధువులు కూడా చేరదీయలేదు. సొంత ఇల్లు కూడా లేని మేము అద్దె తగ్గించుకోవాలని రెండు గదుల ఇంటికి మారాం. నాన్న పెన్షన్‌ డబ్బులతోనే అమ్మ మమ్మల్ని పెంచడం మొదలుపెట్టింది. నిజానికి చిన్నతనంలో నేను బాధ్యత లేకుండా పెరిగా. ఇంటి సమస్యలేవీ పట్టేవి కాదు. అన్నయ్యా, అమ్మా అన్నీ చూసుకుంటారులే అనుకునేవాడిని. ఎప్పుడూ స్నేహితులతోనే కాలక్షేపం. చదువు కూడా పెద్దగా ఎక్కేది కాదు. స్కూల్‌ అయ్యాక ఇంటికి వెళ్లకుండా ఫ్రెండ్స్‌తో కలిసి నేరుగా గేమింగ్‌ పార్లర్లకు వెళ్లేవాడిని. పాకెట్‌మనీ అంతా అక్కడే ఖర్చయ్యేది. చేతిలో ఎక్కువ డబ్బులుంటే స్కూలు కూడా మానేసి ఆ పార్లర్‌లోనే గంటలు గంటలు గడిపేవాడిని. వాటిని ఖర్చు పెట్టేముందు ఇంటి గురించి ఒక్కక్షణం కూడా ఆలోచించేవాడిని కాదు. కానీ మా అమ్మ ఇంట్లో ఇరవై నాలుగ్గంటలూ నా గురించే ఆలోచించి బాధపడేది. నేను ఏమైపోతానో, నా భవిష్యత్తు ఎటువెళుతుందోననీ కుంగిపోయేది. ఆ ఆందోళనతోనే ఇంట్లో ఉన్నంతసేపూ తిడుతూనే ఉండేది. అయినా అవేమీ నేను పట్టించుకునేవాడిని కాదు. అయితే ఇంటర్‌కి వచ్చాక కొన్ని కారణాల వల్ల బిహార్‌ ప్రభుత్వం గేమింగ్‌ పార్లర్లను మూసివేయించింది. ఆ విషయం తెలిసి ఎంత బాధపడ్డానో. ఒకరకంగా డిప్రెషన్‌లోకి వెళ్లానని చెప్పాలి. నిజానికి ఆ నిర్ణయం నా జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. ఎందుకంటే ఆడుకోవడానికి వీలులేక ఎప్పటికైనా అలాంటి గేముల్ని రూపొందించాలనే ఆలోచన కలిగింది. అదే సమయంలో ఇంటి గురించీ ఆలోచించే సమయం దొరికింది. స్నేహితులూ, వ్యాపకాలూ తగ్గిపోయాయి. అమ్మా, అన్నయ్యలకి దగ్గరయ్యా. చాలీచాలని డబ్బుతో అమ్మ పొదుపుగా ఇంటిని నెట్టుకురావడం, తనకోసం ఏమీ ఖర్చు పెట్టుకోకుండా మా కోసం త్యాగాలు చేయడం స్వయంగా చూశా. డబ్బులు వృథా చేసి అమ్మని కష్టపెట్టినందుకు ఎంతో బాధనిపించింది. అప్పట్నుంచీ తనని ఇబ్బంది పెట్టకూడదనీ, బాగా డబ్బు సంపాదించి అమ్మ కోరుకున్నవన్నీ ఇవ్వాలనీ గట్టిగా నిర్ణయించుకున్నా.

అమ్మ నగలమ్మింది...
ఆ తరవాత అతికష్టం మీద చదువుపైన శ్రద్ధ పెట్టా. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ మంచి మార్కులతో పాసయ్యా. ఆ తరవాత ఏం చదవాలీ అని ఆలోచిస్తున్నప్పుడు ఐటీ ఉద్యోగులకు బాగా జీతం వస్తుందని తెలిసింది. పైగా ఆ చదువుతో గేముల్ని కూడా రూపొందించొచ్చని స్నేహితులు చెప్పారు. దాంతో ఎలాగైనా బీటెక్‌ చదవాలనిపించింది. కానీ ఆ రోజుల్లో బీటెక్‌ ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. పైగా అమ్మకి చదివించే స్థోమత లేదు. అన్నయ్య కూడా చదువుకుంటున్నాడు. ఎలాగోలా చదువుకి డబ్బులు కూడబెట్టుకోవడం మంచిదని వెంటనే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయలేదు. ఇంట్లో కూర్చుని చదువుకుంటూనే నాకెంతో ఇష్టమైన గ్రీటింగు కార్డుల్ని తయారు చేసి వాటిని స్థానిక స్టేషనరీ షాపుల్లో అమ్మడం మొదలుపెట్టా. అలానే రెండుమూడు షాపుల్లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం కూడా చేసి డబ్బులు సంపాదించేవాడిని. నేను అలా బాధ్యతగా ఉండటం అమ్మకి సంతోషంగా అనిపించినా... మరోవైపు నేను పడుతున్న కష్టం చూసి తట్టుకోలేకపోయింది. అందుకే నేను దాచుకున్న డబ్బుకు తోడు కొంత అప్పు చేసి ఇంజినీరింగు ప్రవేశ పరీక్ష రాయమని ప్రోత్సహించింది. అలా కష్టపడిన నాకు 1999లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులందర్‌షాలో ఉన్న ‘మరాఠ్‌వాడా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’లో సీటు వచ్చింది. అమ్మ కష్టాన్ని వృథా చేయకూడదు అని నిర్ణయించుకుని హాస్టల్‌కి వెళ్లా. కొన్నాళ్లకి చదువుకితోడు కంప్యూటర్‌ కూడా ఉంటే ఇంకా బాగా చదవొచ్చని అర్థమైంది. కానీ అంత డబ్బు లేదు. ఒకసారి ఇంటికి వెళ్లినప్పుడు స్నేహితులతో అదే విషయం మాట్లాడుతుంటే అమ్మ విన్నది. పదిరోజుల తరవాత కాలేజీకి తిరిగి వెళుతుంటే తన దగ్గరున్న నగలు అమ్మి కంప్యూటర్‌ కొనుక్కోమని డబ్బులు చేతిలో పెట్టింది. అలా కంప్యూటర్‌ కొనుక్కున్న నేను దాన్ని నా గదిలో పెట్టుకుని ఎంతో అపురూపంగా చూసుకునేవాడిని. అమ్మ కష్టాలన్నీ కంప్యూటర్‌ రూపంలో కనిపించేవి. నా స్నేహితులంతా కంప్యూటర్‌ని పాటలూ, సినిమాలూ చూడ్డానికి వాడినా నేను మాత్రం చదువుకోవడానికే ఉపయోగించే వాడిని. అర్ధరాత్రి వరకూ మేల్కొని రకరకాల కంప్యూటర్‌ మ్యాగజైన్లు చదువుతూ సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుంటుండేవాడిని. దాంతో మా క్యాంపస్‌లో టెక్నికల్‌గా ఎవరికి ఏ సందేహం వచ్చినా నా దగ్గరకే వచ్చేవాళ్లు. బీటెక్‌ చివరి ఏడాదిలో ఉండగా తలా ఒక ప్రాజెక్టు చేయమన్నారు. అప్పుడు నేను నాకెంతో ఇష్టమైన గేమును ఒకదాన్ని రూపొందించి ‘ఎగ్గీబాయ్‌’ అనే పేరు పెట్టా. దానికి కాలేజీలో మంచి పేరు వచ్చింది. క్యాంపస్‌లో విద్యార్థులంతా అడిగి మరీ తమ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేయించుకుని ఆడుతుండేవారు. అంతేకాదు, ఓ ప్రముఖ కంప్యూటర్‌ మ్యాగజైన్‌ గేముతోపాటు నా గురించీ తమ పుస్తకంలో ప్రచురించింది. ఆ గుర్తింపు నాలో
తెలియని ఉత్సాహాన్ని నింపింది.

40 కిలోమీటర్లు నడిచే...
అక్కడితో ఆగిపోకుండా ఆ పత్రిక క్లిప్పింగును జోడించి ఓ రెజ్యుమే తయారు చేసుకున్నా. ఆ రోజుల్లో ఇంటర్నెట్‌ ఖరీదు ఎక్కువ. గంటకి వంద రూపాయలు తీసుకునేవారు. మా క్యాంపస్‌ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఓ నెట్‌ కెఫే ఉండేది. ప్రతి శనివారం కాలేజీ మానేసి నడుచుకుంటూ అక్కడకు వెళ్లేవాడిని. మనదేశంలోని పలు గేమింగ్‌ సంస్థల మెయిల్‌ ఐడీలు సంపాదించి నా రెజ్యుమే పంపి వారానికోసారి వెళ్లి చెక్‌ చేసుకునే వాడిని. అలా బీటెక్‌ పూర్తైన ఆరునెలలకి- అంటే 2004లో ముంబయికి చెందిన ఇండియాగేమ్‌ అనే సంస్థ నుంచి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. నా అర్హతల్నీ, కంప్యూటర్‌ పరిజ్ఞానాన్నీ చూసి గేమ్‌ డెవలపర్‌గా ఉద్యోగమిచ్చారు. అక్కడ పనిచేస్తూనే పలు కంప్యూటర్‌ వెబ్‌సైట్లకు గేమింగ్‌ గురించి కథనాలు రాసేవాడిని. నాలుగేళ్లు తిరిగే సరికి జీతం కంటే వెబ్‌సైట్ల ద్వారానే ఎక్కువ ఆదాయం వచ్చేది. అది చూసి నామీద నాకు నమ్మకం పెరిగింది. దాంతో 2008లో ఉద్యోగం మానేశా. ఇంటికోసం ఖర్చుపెట్టగా మిగిలిన రెండు లక్షలతో ముంబయిలోనే ఓ గదిని అద్దెకి తీసుకున్నా. ఓ నాలుగు కంప్యూటర్లు కొని ఇంజినీర్లూ, గ్రాఫిక్‌ డిజైనర్లను చేర్చుకుని ‘గేమేషన్‌ టెక్నాలజీస్‌’ పేరిట సంస్థను స్థాపించి కంప్యూటర్‌ గేములు రూపొందించడం మొదలుపెట్టా. ఈ ఆలోచన బాగా క్లిక్‌ అయింది. కొన్నాళ్ల తరవాత కీప్యాడ్‌ ఫోన్లు అందుబాటులోకి రావడంతో వాటికి అనుగుణంగా ¸ స్నేక్‌ అండ్‌ లేడర్‌, సుడొకు గేములు రూపొందించేవాళ్లం. కొంతకాలానికి స్మార్ట్‌ ఫోన్లు వచ్చాయి. టెక్నాలజీ అంటేనే కొత్తగా వచ్చే ప్రతి నైపుణ్యాన్నీ అందిపుచ్చుకోవాలి. అందుకు తగ్గట్టు వినియోగదారులకీ చేరువ కావాలి. కాబట్టి 2013లో ఆప్‌ ఆధారిత గేముల మీద దృష్టి పెట్టా. అప్పుడే చిన్నప్పుడు ఎక్కువగా ఆడిన లూడో బోర్డు గేము గుర్తొచ్చింది. దాన్ని ఆధునికీకరించి స్మార్ట్‌ గేమ్‌గా తీసుకొస్తే బాగుంటుందనిపించింది. పైగా ఆ పేరు కూడా అందరికీ తెలుసు, ఆట సులువుగా, పోటాపోటీగా ఉంటుంది. అందుకే మా బృందంలోని ఆరుగురు సభ్యులతో కలిసి కసరత్తు మొదలుపెట్టా. బోర్డు గేము నిబంధనలతోనే, టచ్‌ప్యాడ్‌కి అనుగుణంగా పలు ప్రయోగాలు చేస్తూ విఫలమవుతూ మళ్లీమళ్లీ ప్రయత్నిస్తూ... అలా లూడో గేముకి తుదిరూపం ఇవ్వడానికి మాకు మూడేళ్లు పట్టింది. ఈ ఆటను ఎంతదూరంలో ఉన్న వాళ్లతోనైనా ఆడుకునేలా రూపొందించా. ఒంటరిగా ఉన్నా... ఈ గేమ్‌తో బంధువులకీ, స్నేహితులకీ దగ్గరవ్వచ్చు. అందుకే కాబోలు మూడు నెలల్లో గూగుల్‌ ప్లే స్టోర్‌లో లూడో కింగ్‌ టాప్‌ బోర్డు గేముల్లో ఒకటిగా కనిపించడం మొదలైంది. ఏడాది తిరిగేసరికి 12 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ వచ్చి... లాక్‌డౌన్‌ పూర్తయ్యేసరికి 46కోట్లకుపైనే డౌన్‌లోడ్‌ మార్కును దాటేసి సరికొత్త రికార్డును సృష్టించింది. అలానే వార్షికాదాయం కూడా రూ.44.63 కోట్లకు చేరుకుంది. మూడేళ్లలో డౌన్‌లోడ్లు, ఆదాయం గ్రాఫ్‌ ఊహించని విధంగా పైపైకి వచ్చింది. ప్రస్తుతం నలుగురు మాత్రమే ఆడగలిగే ఈ గేమును త్వరలో ఆరుగురు ఆడేలా రూపొందిస్తున్నాం. వాట్సాప్‌ మాదిరి వీడియో చాటింగ్‌ ఏర్పాట్లూ చేస్తున్నాం. ప్రపంచ మార్కెట్‌ని ఆకర్షించడానికి ఆయా దేశాల్లోని పాపులర్‌ గేములకు అనుగుణంగా లూడో కింగ్‌ను వారికి దగ్గర చేస్తున్నాం. పట్టుదల, కృషి, అదృష్టం... ఏదైనా కానీ, అనుకున్నది సాధించినందుకూ, అమ్మ కోరికలన్నీ తీర్చగలిగినందుకూ మాత్రం చెప్పలేనంత సంతోషంగా ఉంది.

15 భాషలు

లూడో కింగ్‌తోపాటు స్నేక్‌ అండ్‌ లేడర్‌, సుడొకు బోర్డు గేముల్నీ తీసుకొచ్చాం. ప్రస్తుతం మా సంస్థలో ఎనభై మంది పనిచేస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలన్నీ నాభార్య సోనీ చూసుకుంటుంది. పబ్‌జీ, టెంపుల్‌రన్‌ వంటివాటిని అధిగమించిన అతిపెద్ద ఆసియా గేముగా లూడో కింగ్‌ నిలిచింది. ఈ గేముకు మనదేశంతోపాటు బంగ్లాదేశ్‌, ఇండోనేషియా, పాకిస్థాన్‌, స్పెయిన్‌, ఇటలీ, జర్మనీ, సౌదీ అరేబియా వంటి మరికొన్ని చోట్లా ఊహించని ఆదరణ లభించింది. లూడో కింగ్‌ ఆప్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో కలిపి దాదాపు 15 భాషలు అందుబాటులో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.