ETV Bharat / jagte-raho

చిత్తూరు: అటవీశాఖ ఉద్యోగిని తొక్కి చంపిన ఏనుగు

author img

By

Published : Oct 14, 2020, 11:50 PM IST

విధులు ముగించుకొని తిరిగి వెళ్తున్న అటవీశాఖ ఉద్యోగులపై ఏనుగు దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఇందులో జీపు డ్రైవర్​గా పని చేస్తున్న సతీష్ అనే వ్యక్తిని గజరాజు తొక్కి చంపేసింది. బీట్ అధికారి హరి ఏనుగు దాడి నుంచి తప్పించుకున్నాడు.

elephant attacked on forest department staff in chittoor
elephant attacked on forest department staff in chittoor

చిత్తూరు జిల్లా యాదమరి మండలం డి.కె. చెరువు సమీపంలో అటవీ సిబ్బందిపై ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో అటవీశాఖ ఉద్యోగి సతీష్​ మృతి చెందాడు. చిత్తూరు పశ్చిమ అటవీ రేంజ్ పరిధిలోని డి.కె పురం బీట్​లో విధులు నిర్వహించేందుకు బీట్ అధికారి హరి, డ్రైవర్ సతీష్ విధులు ముగించుకొని వస్తుండగా.. మార్గమధ్యమంలో జీపును ఏనుగు అడ్డగించింది. ఒక్కసారిగా ఆందోళనకు గురైన ఇద్దరూ... జీపును అక్కడే వదిలేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

వారిద్దరిని వెంటాడిన ఏనుగు... తొలుత డ్రైవర్ సతీష్ పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన సతీష్ ఘటనా స్థలంలోనే ప్రాణాలను వదిలారు. వేగంగా పరిగెత్తిన బీట్ అధికారి హరి... ఏనుగు బారి నుంచి తప్పించుకోగలిగారు. సతీష్​పై దాడి చేసిన ఏనుగు... కొంతసేపటి తరువాత అదే మార్గం గుండా వెళ్తున్న ద్విచక్రవాహనదారులపై దాడికి యత్నించింది.

elephant attacked on forest department staff in chittoor
అటవీశాఖ ఉద్యోగిని తొక్కి చంపిన ఏనుగు

కుటుంబసభ్యులకు సమాచారం...

డ్రైవర్ సతీష్​పై ఏనుగు దాడి సమాచారాన్ని అందుకున్న చిత్తూరు పశ్చిమ రేంజ్ అధికారి సుభాష్, డిప్యూటీ రెంజ్ అధికారి శివరాం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సతీష్ మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.

ఇదీ చదవండి:

మరో ఆవర్తనం: 3 రోజులు కోస్తాంధ్రకు వర్ష సూచన

చిత్తూరు జిల్లా యాదమరి మండలం డి.కె. చెరువు సమీపంలో అటవీ సిబ్బందిపై ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో అటవీశాఖ ఉద్యోగి సతీష్​ మృతి చెందాడు. చిత్తూరు పశ్చిమ అటవీ రేంజ్ పరిధిలోని డి.కె పురం బీట్​లో విధులు నిర్వహించేందుకు బీట్ అధికారి హరి, డ్రైవర్ సతీష్ విధులు ముగించుకొని వస్తుండగా.. మార్గమధ్యమంలో జీపును ఏనుగు అడ్డగించింది. ఒక్కసారిగా ఆందోళనకు గురైన ఇద్దరూ... జీపును అక్కడే వదిలేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

వారిద్దరిని వెంటాడిన ఏనుగు... తొలుత డ్రైవర్ సతీష్ పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన సతీష్ ఘటనా స్థలంలోనే ప్రాణాలను వదిలారు. వేగంగా పరిగెత్తిన బీట్ అధికారి హరి... ఏనుగు బారి నుంచి తప్పించుకోగలిగారు. సతీష్​పై దాడి చేసిన ఏనుగు... కొంతసేపటి తరువాత అదే మార్గం గుండా వెళ్తున్న ద్విచక్రవాహనదారులపై దాడికి యత్నించింది.

elephant attacked on forest department staff in chittoor
అటవీశాఖ ఉద్యోగిని తొక్కి చంపిన ఏనుగు

కుటుంబసభ్యులకు సమాచారం...

డ్రైవర్ సతీష్​పై ఏనుగు దాడి సమాచారాన్ని అందుకున్న చిత్తూరు పశ్చిమ రేంజ్ అధికారి సుభాష్, డిప్యూటీ రెంజ్ అధికారి శివరాం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సతీష్ మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.

ఇదీ చదవండి:

మరో ఆవర్తనం: 3 రోజులు కోస్తాంధ్రకు వర్ష సూచన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.