ETV Bharat / jagte-raho

కాసేపట్లో పెళ్లి.... అంతలోనే అనంతలోకాలకు - కాసేపట్లో పెళ్లి.... అంతలోనే అనంతలోకాలకు

ఇళ్లంతా పెళ్లిసందడి.. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ.. అంతలోనే పెను విషాదం. కొద్దిగంటల్లో పెళ్లి జరుగుతుందనగా.. పెళ్లికొడుకు శవమై కనిపించాడు. అది కూడా కళ్యాణ మండపంలోనే. తెలంగాణలో జరిగిన ఈ విషాద ఘటన అందర్నీ ఆశ్చర్య పరిచింది. కాసేపట్లో పెళ్లి జరుగుతుందని ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్న సమయంలో సందీప్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

కాసేపట్లో పెళ్లి.... అంతలోనే అనంతలోకాలకు
author img

By

Published : Nov 10, 2019, 11:47 PM IST

కాసేపట్లో పెళ్లి.... అంతలోనే అనంతలోకాలకు

తెలంగాణలోని మేడ్చల్‌లో దారుణం జరిగింది. కొంపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లికుమారుడు సందీప్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లి ముహూర్తానికి ముందు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయం పది గంటలకు వివాహం జరగాల్సి ఉండగా.. వేకువజామునే వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్నారు.

ఏడు గంటల సమయంలో ఫంక్షన్‌ హాల్‌లో ఓ గదిలోకి ఒంటరిగా వెళ్లి సందీప్‌ గడియ పెట్టుకున్నాడు. ఎంతకూ వరుడు బయటకు రాకపోవటం వల్ల అనుమానించిన కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు బద్దలుకొట్టి చూడగా సందీప్‌ అప్పటికే ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ ఘటనతో ఫంక్షన్‌హాల్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. వధూవరుల కుటుంబాలు దిగ్భ్రాంతి చెందాయి. వరుడి కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసా చారి, పద్మ దంపతుల కుమారుడైన సందీప్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతని ఆత్మహత్యకు కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి:

కళింగపట్నంలో సముద్ర స్నానానికి వెళ్లి.. విద్యార్థుల గల్లంతు

కాసేపట్లో పెళ్లి.... అంతలోనే అనంతలోకాలకు

తెలంగాణలోని మేడ్చల్‌లో దారుణం జరిగింది. కొంపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లికుమారుడు సందీప్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లి ముహూర్తానికి ముందు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయం పది గంటలకు వివాహం జరగాల్సి ఉండగా.. వేకువజామునే వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్నారు.

ఏడు గంటల సమయంలో ఫంక్షన్‌ హాల్‌లో ఓ గదిలోకి ఒంటరిగా వెళ్లి సందీప్‌ గడియ పెట్టుకున్నాడు. ఎంతకూ వరుడు బయటకు రాకపోవటం వల్ల అనుమానించిన కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు బద్దలుకొట్టి చూడగా సందీప్‌ అప్పటికే ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ ఘటనతో ఫంక్షన్‌హాల్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. వధూవరుల కుటుంబాలు దిగ్భ్రాంతి చెందాయి. వరుడి కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసా చారి, పద్మ దంపతుల కుమారుడైన సందీప్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతని ఆత్మహత్యకు కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి:

కళింగపట్నంలో సముద్ర స్నానానికి వెళ్లి.. విద్యార్థుల గల్లంతు

TG_Hyd_08_10_Pellikoduku Aatmahatya_Avb_TS10011 కాసేపట్లో వివాహం జరుగుతుంది అన్ని ఇరు కుటుంబాలు సంతోషం లో ఉండగా పెళ్ళి కుమారుడిని తయారు కావడానికి రూమ్ లో చూడగా ఉరి వేసుకొని కన్పించాడు.. మేడ్చల్ జిల్లా కొంపల్లి లోని శ్రీ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు 11.35 కు దిల్ సుఖ్ నగర్ కి చెందిన శ్రీనివాసా చారి కుమారుడు సందీప్ కు బాలా నగర్ కి చెందిన మౌనిక వివాహం జరిగే నేపధ్యంలో సరగ్గా ఉదయం సమయంలో వరుడు శ్రీ ఫంక్షన్ హాల్ లోని పెళ్ళి కుమారిని గదిలో ఉరి వేసుకొని కనిపించారు... దాంతో బందువులు ప్రవేట్ ఆసుపత్రి కి తరలించారు.. అప్పటికే సందీప్ మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు...బంధువల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహం శవ పరీక్ష కోసం గాంధీ ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు.. పోలీసుల వారిని వివరణ కోరగా వరుడు సందీప్ కుటుంబ సభ్యులు ఈ రోజు తెల్లవారుజామున 3.30 సమయంలో ఫంక్షన్ హాల్ చేరుకున్నారు,,సందీప్ తన గదిలోని వెల్లి నిద్ర పోతానని తలుపు గడియ పెట్టుకున్నాడు.. ఉదయం భందువులు తలుపు కొట్టగా తీయకపోవడం తో డూప్లికేట్ తాళం తో తలుపు తెరవగా ఉరి వేసుకొని కన్పించాడు...హుటాహుటిన ఆసుపత్రి కి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు... ప్రాదమిక విచారణలో వరుడు సందీప్ తల్లి 16 సం" క్రితం చనిపోగా సందీప్ వారి అమ్మమ్మ దగ్గర పెరిగాడు...3 నెలల క్రితం అతని తాత కూడ చనిపోయునాడు...సందీప్ కుటుంబ పరిస్థితులు ,పెంచిన తాత చనిపోవడం కలిచి వేసి మనస్తాపం తోనే చనిపోయున ట్లు బావిస్తున్నామని పేట్ బషీరాబాద్ సి.ఐ మహేష్ అన్నారు... Byte : మహేష్, పెట్ బషీరాబాద్ సిఐ Note : visuals ftp లో పంపాను పెళ్ళికొడుకు ఫొటో మరియు చనిపోయిన ఫోటో డెస్క్ whtsapp కి పంపాను

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.