ETV Bharat / jagte-raho

బైకును ఢీ కొట్టిన వ్యాన్.. ముగ్గురు మృతి

author img

By

Published : Jan 2, 2021, 7:07 AM IST

Updated : Jan 2, 2021, 9:05 AM IST

accident at gopalapuram
accident at gopalapuram

07:06 January 02

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన వ్యాన్

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కడప జిల్లా మైదుకూరు నుంచి కాకినాడ టమాటా లోడుతో వ్యాన్​ వెళ్తోంది. తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా గోపాలపురానికి చేరుకుంది. జాతీయరహదారిపై వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి.. బోల్తా పడింది. ఈ ఘటనలో మోటార్ సైకిల్​పై వెళ్తున్న గోపాలపురంవాసి కండేల్లి సతీష్ (21).. అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలిస్తుండగా గోపాలపురానికి చెందిన కొండేటి చంటి (20) మృతి చెందాడు. కొత్తపేట మండలం కండ్రిగ గ్రామానికి చెందిన వంగలపూడి సురేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యాన్ డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

గుడికి వెళ్లి వచ్చే లోపు ఇల్లు గుల్ల!

07:06 January 02

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన వ్యాన్

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కడప జిల్లా మైదుకూరు నుంచి కాకినాడ టమాటా లోడుతో వ్యాన్​ వెళ్తోంది. తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా గోపాలపురానికి చేరుకుంది. జాతీయరహదారిపై వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి.. బోల్తా పడింది. ఈ ఘటనలో మోటార్ సైకిల్​పై వెళ్తున్న గోపాలపురంవాసి కండేల్లి సతీష్ (21).. అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలిస్తుండగా గోపాలపురానికి చెందిన కొండేటి చంటి (20) మృతి చెందాడు. కొత్తపేట మండలం కండ్రిగ గ్రామానికి చెందిన వంగలపూడి సురేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యాన్ డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

గుడికి వెళ్లి వచ్చే లోపు ఇల్లు గుల్ల!

Last Updated : Jan 2, 2021, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.