ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదం... మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో తల ఇరుక్కుపోయి...

author img

By

Published : Dec 11, 2020, 11:53 AM IST

హైదరాబాద్​ అమీర్​పేట్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. ద్విచక్ర వాహనంపై కూకట్​పల్లి వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు వాహనం అదుపు తప్పి పుట్ పాత్ రెయిలింగ్​కు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదం... మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో తల ఇరుక్కుపోయి...
రోడ్డు ప్రమాదం... మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో తల ఇరుక్కుపోయి...

హైదరాబాద్‌లోని అమీర్‌పేట చౌరస్తాలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరీష్‌ గుప్తా(24), అతని స్నేహితుడు రవితేజ ద్విచక్రవాహనంపై అతి వేగంతో కూకట్‌పల్లి వైపు బయల్దేరారు. ఈ క్రమంలో పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు.

ప్రమాదంలో గాయపడిన వ్యక్తి
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి

ఈఘటనలో గిరీష్‌ గుప్తా తల మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రవితేజను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు .. గ్యాస్‌కట్టర్‌తో ఇనుప కడ్డీలను తొలగించి గుప్తాను బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి : పెద్దలు అంగీకరించలేదని... ప్రేమజంట ఆత్మహత్య

హైదరాబాద్‌లోని అమీర్‌పేట చౌరస్తాలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరీష్‌ గుప్తా(24), అతని స్నేహితుడు రవితేజ ద్విచక్రవాహనంపై అతి వేగంతో కూకట్‌పల్లి వైపు బయల్దేరారు. ఈ క్రమంలో పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు.

ప్రమాదంలో గాయపడిన వ్యక్తి
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి

ఈఘటనలో గిరీష్‌ గుప్తా తల మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రవితేజను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు .. గ్యాస్‌కట్టర్‌తో ఇనుప కడ్డీలను తొలగించి గుప్తాను బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి : పెద్దలు అంగీకరించలేదని... ప్రేమజంట ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.