రాష్ట్రంలో అహంకారంతో కూడిన అరాచక పాలన కావాలో,.. అభివృద్ధి పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని తెలుగుదేశంపార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు తెదేపా అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి దువ్వ గ్రామంలో రోడ్షో నిర్వహించారు. తెదేపాను మళ్లీ గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. దువ్వతోపాటు అత్తిలిమండలంలోని పలు గ్రామాలలో ఆయన రోడ్షో నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై అనుసరించారు.
జగన్ అధికారంలోకి వస్తే.. అరాచక పాలనే: వంగవీటి రాధా
తణుకు తెదేపా అభ్యర్థికి మద్దతుగా ఆ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ రోడ్షో నిర్వహించారు. తెదేపా అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమని ఓటర్లకు వివరించారు.
రాష్ట్రంలో అహంకారంతో కూడిన అరాచక పాలన కావాలో,.. అభివృద్ధి పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని తెలుగుదేశంపార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు తెదేపా అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి దువ్వ గ్రామంలో రోడ్షో నిర్వహించారు. తెదేపాను మళ్లీ గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. దువ్వతోపాటు అత్తిలిమండలంలోని పలు గ్రామాలలో ఆయన రోడ్షో నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై అనుసరించారు.
ఇవీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా వికారి నామ సంవత్సర వేడుకలు
రాష్ట్రనికి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ మోసం చేసారని aicc ప్రధాన కార్యదర్శి ,సినీ నటి నగ్మా ఆరోపించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా రెపల్లెలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మోపిదేవి శ్రీనివాస్, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి జె.డి శీలంతో ప్రచారం నిర్వహించి..నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గోన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంకి ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశానికి చేసింది ఏమిలేదన్నారు.బీజేపీ హయాంలో ఉగ్రదాదులు పెరిగాయన్న నగ్న...కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దాడులు జరగలేదన్నారు. మోడీ ప్రధాని కాకముందే దేశంలో విద్యా, వైద్య,సాంకేతిక ,అంతరిక్ష రంగాలను అభివృద్ధి చేశామని...అవన్నీ మోడీనే చేశానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మోదీ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మడంలేదని ఆమె తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి కూడా బిజెపితో కలిశారని అందుకే రాష్ట్ర విభజన హామీల పై కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తేనే అన్నిరంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు.రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తు పై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Body:av
Conclusion:etv contributer
sk.meera saheb 7075757517
repalle
Guntur jilla