ETV Bharat / crime

VIRAL VIDEO పేకాట ఆడుతున్న చిన్నారులను వాళ్లు ఏం చేశారో తెలిస్తే షాక్?

author img

By

Published : May 5, 2022, 3:48 PM IST

Attack on Children Viral Video: చిన్నపిల్లలు తప్పు చేస్తే దండించడం ఎక్కడైనా జరిగేదే. అయితే.. మరీ పెద్ద శిక్షలు కాకుండా.. ఓ చెంప దెబ్బ.. లేదంటే గోడ కుర్చీ.. మరీ ఎక్కువ అంటే.. కర్రతో ఓ రెండు దెబ్బలు కొట్టడం చేస్తారు. ఇంతకు మించి ఎక్కువగా శిక్షించడానికి ఎవరికీ మనసొప్పదు. కానీ.. ఇక్కడ మాత్రం చిన్నారులపై కొంతమంది పైశాచికంగా ప్రవర్తించారు. వారిని నగ్నంగా చేసి విచక్షణారహితంగా దాడి చేశారు. తెలంగాణలో జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Attack on Children
పేకాట ఆడుతున్న చిన్నారులపై విచక్షణారహితంగా దాడి

పేకాట ఆడుతున్న చిన్నారులపై విచక్షణారహితంగా దాడి

Attack on Children Viral Video: తెలంగాణలోని హైదరాబాద్​ మంగళ్​హాట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో గత నెల 29న జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారులు పేకాట ఆడుతున్నారనే కారణంతో వారిని నగ్నంగా చేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వీడియో వైరల్​ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

గత శుక్రవారం ధూల్​పేట్​ పరిధిలోని ఓ కొండపై 16 మంది చిన్నారులు పేకాట ఆడుతున్నారు. ఇది గమనించిన ముగ్గురు యువకులు.. వారిని నగ్నంగా చేశారు. అనంతరం చిన్నారులపై విచక్షణారహితంగా కర్రతో దాడికి పాల్పడ్డారు. ముగ్గురిలో మరో యువకుడు.. ఆ వీడియోను తన ఫోన్లో చిత్రీకరించాడు.

అనంతరం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్​ కావడంతో తెలుసుకున్న ఓ చిన్నారి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులకు నోటీసులు పంపించారు. కాగా చిన్నారులను భాజపా నాయకులే కొట్టారని సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్​ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. భాజపా నాయకులకు, నిందితులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కేసు విచారణలో ఉందని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి: హృదయం లేని జగన్ రెడ్డి పాలనలో.. ఎన్నో దారుణాలు: చంద్రబాబు

పేకాట ఆడుతున్న చిన్నారులపై విచక్షణారహితంగా దాడి

Attack on Children Viral Video: తెలంగాణలోని హైదరాబాద్​ మంగళ్​హాట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో గత నెల 29న జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారులు పేకాట ఆడుతున్నారనే కారణంతో వారిని నగ్నంగా చేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వీడియో వైరల్​ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

గత శుక్రవారం ధూల్​పేట్​ పరిధిలోని ఓ కొండపై 16 మంది చిన్నారులు పేకాట ఆడుతున్నారు. ఇది గమనించిన ముగ్గురు యువకులు.. వారిని నగ్నంగా చేశారు. అనంతరం చిన్నారులపై విచక్షణారహితంగా కర్రతో దాడికి పాల్పడ్డారు. ముగ్గురిలో మరో యువకుడు.. ఆ వీడియోను తన ఫోన్లో చిత్రీకరించాడు.

అనంతరం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్​ కావడంతో తెలుసుకున్న ఓ చిన్నారి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులకు నోటీసులు పంపించారు. కాగా చిన్నారులను భాజపా నాయకులే కొట్టారని సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్​ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. భాజపా నాయకులకు, నిందితులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కేసు విచారణలో ఉందని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి: హృదయం లేని జగన్ రెడ్డి పాలనలో.. ఎన్నో దారుణాలు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.