ETV Bharat / crime

Son murdered father: రూ.200 ఇవ్వలేదని తండ్రినే చంపేశాడు

author img

By

Published : Jul 21, 2021, 5:40 PM IST

పున్నామ నరకం నుంచి కాపాడాల్సిన తనయుడే తండ్రి పాలిట యముడయ్యాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రినే అంతమొందించాడు. తండ్రిపై ఆగ్రహంతో రోకలిబండతో దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన.. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగింది.

Son murdered father for money
రూ.200 ఇవ్వలేదని తండ్రినే చంపేసిన యువకుడు

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో రోకలిబండతో బాది తండ్రినే హత్య చేశాడు ఆ తనయుడు. జిల్లాకేంద్రంలోని హనుమాన్​ బస్తీలో ఈ ఘటన జరిగింది.

సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న గోశిక కొమురయ్య(61) ఇటీవలే మెడికల్‌ పరీక్షలో అన్‌ఫిట్‌ అయ్యాడు. అతని ఉద్యోగం కుమారుడికి ఇవ్వకుండా యాజమాన్యం అందించిన పరిహారం తీసుకున్నాడు. ఈ విషయంలో మనస్తాపానికి గురైన కొమురయ్య కుమారుడు శివకుమార్‌... తండ్రిపై కోపం పెంచుకున్నాడు.

రెండొందల కోసం..

మంగళవారం రాత్రి.. మద్యం సేవించడానికి 200 రూపాయలు ఇవ్వాలని తండ్రిని అడిగాడు. డబ్బులు లేవని కొమురయ్య చెప్పడంతో ఆగ్రహంతో శివకుమార్​ తండ్రిపై రోకలిబండతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న 3 వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. పరారీలో ఉన్న శివకుమార్‌ కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:

AP RAINS: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో రోకలిబండతో బాది తండ్రినే హత్య చేశాడు ఆ తనయుడు. జిల్లాకేంద్రంలోని హనుమాన్​ బస్తీలో ఈ ఘటన జరిగింది.

సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న గోశిక కొమురయ్య(61) ఇటీవలే మెడికల్‌ పరీక్షలో అన్‌ఫిట్‌ అయ్యాడు. అతని ఉద్యోగం కుమారుడికి ఇవ్వకుండా యాజమాన్యం అందించిన పరిహారం తీసుకున్నాడు. ఈ విషయంలో మనస్తాపానికి గురైన కొమురయ్య కుమారుడు శివకుమార్‌... తండ్రిపై కోపం పెంచుకున్నాడు.

రెండొందల కోసం..

మంగళవారం రాత్రి.. మద్యం సేవించడానికి 200 రూపాయలు ఇవ్వాలని తండ్రిని అడిగాడు. డబ్బులు లేవని కొమురయ్య చెప్పడంతో ఆగ్రహంతో శివకుమార్​ తండ్రిపై రోకలిబండతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న 3 వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. పరారీలో ఉన్న శివకుమార్‌ కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:

AP RAINS: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.