ETV Bharat / crime

Online Loan Apps : ఎస్సైనని బెదిరించి ఖాతా ఖల్లాస్ - online loan cheating cases in telangana

రుణ యాప్‌ల కేసులో మరికొంత మంది నిందితుల కోసం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గాలిస్తుంటే.. మరోపక్క చైనాలో ఉన్న నిందితులు.. పోలీసులు స్తంభింపజేసిన ఖాతాల్లోని నగదును ఖాళీ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆనంద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. పట్టుబడ్డ ఆనంద్‌కు నకిలీ ఎస్సై స్నేహితుడిగా పరిచయం అయినట్లు.. లక్షల రూపాయలు ఆశ జూపి ఈ పథకానికి ఆనంద్‌ను ఒప్పించినట్లు గుర్తించారు.

cyber crime
ఎస్సైనని బెదిరించి ఖాతా ఖల్లాస్
author img

By

Published : Jun 5, 2021, 7:20 PM IST

రుణాల యాప్​ల ద్వారా 30 వేల కోట్ల లావాదేవీలు నిర్వహించిన చైనీయులు. పోలీసులు స్తంభింపజేసిన తమ ఖాతాల్లో నగదు నిల్వలను విత్ డ్రా చేసుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల పేరును వినియోగించుకున్నారు. గుర్గావ్, నోయిడా, దిల్లీ, బెంగుళూరు, కోల్‌కతా నగరాల్లో పోలీసులు స్తంభింపజేసిన 300 కోట్ల నగదును ఎలాగైనా మళ్లీ కొట్టేసేందుకు ఈ ఎత్తుగడ వేశారు. ఇందుకోసం మూడు నెలల క్రితం చైనీయులు ప్రణాళిక సిద్ధం చేశారని పోలీసులు గుర్తించారు.

పోలీసుల పేరుతో టోకరా..

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని బేగంపేట కాల్ సెంటర్​కు వస్తున్న ఆనంద్ అనే సైబర్ నేరస్థుడి వివరాలు తెలుసుకుని పథకం అమలు చేస్తే ఖాతాల్లోని సొత్తు కాజేయేచ్చని భావించారు. డీల్​కు అతను అంగీకరించాక సైబర్ క్రైమ్స్ ఎస్సైగా కోల్‌కతా కు పంపించి రెండు బ్యాంక్ ఖాతాల్లోని 1.18 కోట్ల నగదును విడుదల చేయించుకున్నారు. నకిలీ ఎస్సైగా వెళ్లిన నిందితుడిని పట్టుకుంటే తెరవెనుక చైనీయులను బయటకు వస్తారని అంచనాతో ఎస్సై కోసం గాలిస్తున్నారు. నకిలీ ఎస్సై బ్యాంక్ అధికారులను బెదిరించి నగదును బేగంపేటలో ఉంటున్న తన స్నేహితుడు ఆనంద్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించాడు. తన బ్యాంక్ ఖాతాలో డబ్బు రాగానే ఆనంద్.. నకిలీ ఎస్సై సూచించిన బ్యాంక్ ఖాతాల్లోకి వెంటనే మార్చేశాడు. ఈ కేసులో రెండు రోజుల క్రితం ఆనంద్​ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి కీలక ఆధారాలు సేకరించారు.

నకిలీ ఎస్సై..

బేగంపేట ఎయిర్​పోర్ట్ ఉద్యోగుల కాలనీలో ఉంటున్న ఆనంద్ ఒక రియల్టర్. ఆనంద్​కు నకిలీ ఎస్సైగా నటించిన నిందితుడు ఒక స్నేహితుడిగా పరిచయమయ్యారు. ఒక ఆఫర్ ఉంది.. మనం చేస్తే కోట్లు వస్తాయని ఆనంద్​ను నకిలీ ఎస్సై ప్రభావితం చేశాడు. చైనీయుల నుంచి ఆదేశాలు రావడంతో రెండు నెలల క్రితం ఇద్దరూ తమ పనులు పూర్తి చేశారు. తన తెలివితేటలు ఉపయోగించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ పేరుతో ఆనంద్ నకిలీ లేఖలను గుర్గావ్ లోని ఐసీఐసీఐ బ్యాంక్ కు పంపించాడు. ఆనంద్ స్నేహితుడు మాత్రం ఎస్సైగా కోల్‌కతాకు వెళ్లాడు. బ్యాంకు అధికారుల వద్ద ఎస్సైగా చలామణి అయి ఖాతాల్లోని నగదును బదిలీ చేయుంచుకున్నాడు.

ఖాతాలు ఖాళీ..

అయితే ...రుణ యాప్​ల కేసుల విచారణాధికారిగా ఉన్న ఇన్ స్పెక్టర్ ప్రశాంత్..దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో స్తంభింపజేసిన నగదు నిల్వల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఏప్రిల్ నెల మొదటి వారంలో కోల్​కతాలోని ఐసీఐసీఐ అలీపూర్‌ ద్వార్ శాఖలో చైనా కంపెనీల డబ్బు లేదని గుర్తించారు. గచ్చిబౌలిలోని ఐసీఐసీఐ ప్రాంతీయ కార్యాలయం అధికారులను సంప్రదించి..కోల్​కతాలోని డబ్బును ఇతర ఖాతాలకు మళ్లించి వివరాలు చెప్పాలని కోరారు. ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులు అంతర్గతంగా విచారణ చేపట్టి నెలరోజుల తర్వాత అధికారికంగా నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా 1.18 కోట్లు తీసుకున్న ఆనంద్​ను నిందితుడిగా గుర్తించారు. ఆనంద్​తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అతడి కదలికలపై నిఘా ఉంచారు. నకిలీ ఎస్సైగా నటించిన నిందితునికోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి :

Audio viral: నెల్లూరు జీజీహెచ్​లో లైంగిక వేధింపుల కలకలం

రుణాల యాప్​ల ద్వారా 30 వేల కోట్ల లావాదేవీలు నిర్వహించిన చైనీయులు. పోలీసులు స్తంభింపజేసిన తమ ఖాతాల్లో నగదు నిల్వలను విత్ డ్రా చేసుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల పేరును వినియోగించుకున్నారు. గుర్గావ్, నోయిడా, దిల్లీ, బెంగుళూరు, కోల్‌కతా నగరాల్లో పోలీసులు స్తంభింపజేసిన 300 కోట్ల నగదును ఎలాగైనా మళ్లీ కొట్టేసేందుకు ఈ ఎత్తుగడ వేశారు. ఇందుకోసం మూడు నెలల క్రితం చైనీయులు ప్రణాళిక సిద్ధం చేశారని పోలీసులు గుర్తించారు.

పోలీసుల పేరుతో టోకరా..

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని బేగంపేట కాల్ సెంటర్​కు వస్తున్న ఆనంద్ అనే సైబర్ నేరస్థుడి వివరాలు తెలుసుకుని పథకం అమలు చేస్తే ఖాతాల్లోని సొత్తు కాజేయేచ్చని భావించారు. డీల్​కు అతను అంగీకరించాక సైబర్ క్రైమ్స్ ఎస్సైగా కోల్‌కతా కు పంపించి రెండు బ్యాంక్ ఖాతాల్లోని 1.18 కోట్ల నగదును విడుదల చేయించుకున్నారు. నకిలీ ఎస్సైగా వెళ్లిన నిందితుడిని పట్టుకుంటే తెరవెనుక చైనీయులను బయటకు వస్తారని అంచనాతో ఎస్సై కోసం గాలిస్తున్నారు. నకిలీ ఎస్సై బ్యాంక్ అధికారులను బెదిరించి నగదును బేగంపేటలో ఉంటున్న తన స్నేహితుడు ఆనంద్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించాడు. తన బ్యాంక్ ఖాతాలో డబ్బు రాగానే ఆనంద్.. నకిలీ ఎస్సై సూచించిన బ్యాంక్ ఖాతాల్లోకి వెంటనే మార్చేశాడు. ఈ కేసులో రెండు రోజుల క్రితం ఆనంద్​ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి కీలక ఆధారాలు సేకరించారు.

నకిలీ ఎస్సై..

బేగంపేట ఎయిర్​పోర్ట్ ఉద్యోగుల కాలనీలో ఉంటున్న ఆనంద్ ఒక రియల్టర్. ఆనంద్​కు నకిలీ ఎస్సైగా నటించిన నిందితుడు ఒక స్నేహితుడిగా పరిచయమయ్యారు. ఒక ఆఫర్ ఉంది.. మనం చేస్తే కోట్లు వస్తాయని ఆనంద్​ను నకిలీ ఎస్సై ప్రభావితం చేశాడు. చైనీయుల నుంచి ఆదేశాలు రావడంతో రెండు నెలల క్రితం ఇద్దరూ తమ పనులు పూర్తి చేశారు. తన తెలివితేటలు ఉపయోగించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ పేరుతో ఆనంద్ నకిలీ లేఖలను గుర్గావ్ లోని ఐసీఐసీఐ బ్యాంక్ కు పంపించాడు. ఆనంద్ స్నేహితుడు మాత్రం ఎస్సైగా కోల్‌కతాకు వెళ్లాడు. బ్యాంకు అధికారుల వద్ద ఎస్సైగా చలామణి అయి ఖాతాల్లోని నగదును బదిలీ చేయుంచుకున్నాడు.

ఖాతాలు ఖాళీ..

అయితే ...రుణ యాప్​ల కేసుల విచారణాధికారిగా ఉన్న ఇన్ స్పెక్టర్ ప్రశాంత్..దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో స్తంభింపజేసిన నగదు నిల్వల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఏప్రిల్ నెల మొదటి వారంలో కోల్​కతాలోని ఐసీఐసీఐ అలీపూర్‌ ద్వార్ శాఖలో చైనా కంపెనీల డబ్బు లేదని గుర్తించారు. గచ్చిబౌలిలోని ఐసీఐసీఐ ప్రాంతీయ కార్యాలయం అధికారులను సంప్రదించి..కోల్​కతాలోని డబ్బును ఇతర ఖాతాలకు మళ్లించి వివరాలు చెప్పాలని కోరారు. ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులు అంతర్గతంగా విచారణ చేపట్టి నెలరోజుల తర్వాత అధికారికంగా నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా 1.18 కోట్లు తీసుకున్న ఆనంద్​ను నిందితుడిగా గుర్తించారు. ఆనంద్​తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అతడి కదలికలపై నిఘా ఉంచారు. నకిలీ ఎస్సైగా నటించిన నిందితునికోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి :

Audio viral: నెల్లూరు జీజీహెచ్​లో లైంగిక వేధింపుల కలకలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.