ETV Bharat / crime

selfie suicide: 'నా చావుకు మా సారే కారణం.. నన్ను హింసించాడు..'

author img

By

Published : Sep 15, 2021, 9:22 AM IST

Updated : Sep 15, 2021, 4:32 PM IST

selfie suicide
selfie suicide

09:20 September 15

సెల్ఫీ వీడియో తీసుకుంటూ వ్యక్తి ఆత్మహత్య

సెల్ఫీ వీడియో తీసుకుంటూ వ్యక్తి ఆత్మహత్య

యజమాని చిత్రహింసలు పెట్టాడని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా డోన్​ మండలం ఆవులదొడ్డి గ్రామానికి చెందిన అశోక్​ మూడు రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్యహత్యకు యత్నించాడు. స్థానికులు అతనిని  డోన్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డోన్‌ ప్రభుత్వాస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతూ అశోక్‌ బుధవారం మృతి చెందాడు.  గత నాలుగేళ్లుగా ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అశోక్ పని చేస్తున్నాడు. ఫ్యాక్టరీ మేనేజర్ చిత్రహింసలు పెట్టాడని సెల్ఫీ వీడియోలో చెప్పారు.

'నేను మందు తాగి చచ్చిపోతున్నా. దానికి కారణం మా సార్​.. డ్యూటీలో నన్నే టార్గెట్​ చేసి చేయకూడని పనులు చేయించుకుని.. బూతులు మాట్లాడి.. నన్ను టార్చర్​ పెట్టేవాడు. అందుకనే.. మందుతాగి చచ్చిపోతున్నా..'- బాధితుడు.

అశోక్ మృతికి నిరసనగా కర్నూలు  డోన్​లో కెమికల్ ఫ్యాక్టరీ ముందు ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. అశోక్ మృతికి కారణమైన కెమికల్ ఫ్యాక్టరీ మేనేజర్ శరత్ని, నిఖిల్​ను అరెస్టు చేయాలని  డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులపై కఠినంగాా వ్యవహరించడం సరికాదని వారు హెచ్చరించారు. కార్మికులను వేధించడం, ఒత్తిళ్లకు గురిచేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. 

'మా కుమారుడి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. అశోక్..​ పైఅధికారులు అతనిని వేధింపులకు గురి చేసేవారు. ఫ్యాక్టరీ యజమాన్యం మా కుటుంబానికి న్యాయం చేయాలి' -అశోక్​ తండ్రి

ఇదీ చదవండి:

ATM CHORI: ఏటీఎంలో చోరీకి యత్నం.. ఇద్దరు అరెస్ట్​

09:20 September 15

సెల్ఫీ వీడియో తీసుకుంటూ వ్యక్తి ఆత్మహత్య

సెల్ఫీ వీడియో తీసుకుంటూ వ్యక్తి ఆత్మహత్య

యజమాని చిత్రహింసలు పెట్టాడని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా డోన్​ మండలం ఆవులదొడ్డి గ్రామానికి చెందిన అశోక్​ మూడు రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్యహత్యకు యత్నించాడు. స్థానికులు అతనిని  డోన్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డోన్‌ ప్రభుత్వాస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతూ అశోక్‌ బుధవారం మృతి చెందాడు.  గత నాలుగేళ్లుగా ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అశోక్ పని చేస్తున్నాడు. ఫ్యాక్టరీ మేనేజర్ చిత్రహింసలు పెట్టాడని సెల్ఫీ వీడియోలో చెప్పారు.

'నేను మందు తాగి చచ్చిపోతున్నా. దానికి కారణం మా సార్​.. డ్యూటీలో నన్నే టార్గెట్​ చేసి చేయకూడని పనులు చేయించుకుని.. బూతులు మాట్లాడి.. నన్ను టార్చర్​ పెట్టేవాడు. అందుకనే.. మందుతాగి చచ్చిపోతున్నా..'- బాధితుడు.

అశోక్ మృతికి నిరసనగా కర్నూలు  డోన్​లో కెమికల్ ఫ్యాక్టరీ ముందు ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. అశోక్ మృతికి కారణమైన కెమికల్ ఫ్యాక్టరీ మేనేజర్ శరత్ని, నిఖిల్​ను అరెస్టు చేయాలని  డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులపై కఠినంగాా వ్యవహరించడం సరికాదని వారు హెచ్చరించారు. కార్మికులను వేధించడం, ఒత్తిళ్లకు గురిచేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. 

'మా కుమారుడి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. అశోక్..​ పైఅధికారులు అతనిని వేధింపులకు గురి చేసేవారు. ఫ్యాక్టరీ యజమాన్యం మా కుటుంబానికి న్యాయం చేయాలి' -అశోక్​ తండ్రి

ఇదీ చదవండి:

ATM CHORI: ఏటీఎంలో చోరీకి యత్నం.. ఇద్దరు అరెస్ట్​

Last Updated : Sep 15, 2021, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.