ETV Bharat / crime

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.. రూ.15 లక్షల విలువైన బైకులు స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి 15 లక్షల విలువైన 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలోనూ కేసులు నమోదయ్యాయని కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు.

author img

By

Published : Mar 30, 2021, 1:59 PM IST

inter state thieves arrested by tanuku police
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
inter state thieves arrested by tanuku police
16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్నఅంతరాష్ట్ర దొంగల ముఠాను పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 లక్షల విలువైన 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు.. రాజేశ్​, సాయిగుప్త, మహేంద్రలు.. నంబర్ లేని బైక్‌పై పెరవలి వై జంక్షన్‌ వద్ద తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వాళ్ల నుంచి ఒక లాప్‌ ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో పలు కేసులు కూడా నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: పోలవరం మూలలంకలో ఎన్జీటీ సంయుక్త కమిటీ పర్యటన

inter state thieves arrested by tanuku police
16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్నఅంతరాష్ట్ర దొంగల ముఠాను పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 లక్షల విలువైన 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు.. రాజేశ్​, సాయిగుప్త, మహేంద్రలు.. నంబర్ లేని బైక్‌పై పెరవలి వై జంక్షన్‌ వద్ద తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వాళ్ల నుంచి ఒక లాప్‌ ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో పలు కేసులు కూడా నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: పోలవరం మూలలంకలో ఎన్జీటీ సంయుక్త కమిటీ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.