ETV Bharat / crime

CRIME: అనుమానంతో చంపి.. కరోనాను వాడుకుని.. చివరికి...!

author img

By

Published : Jul 3, 2021, 6:24 PM IST

హైదరాబాద్​లోని వనస్థలిపురంలో భార్యను హత్య చేసిన కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. భార్య మీద తనకున్న అనుమానంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్యను చంపేసి.. కరోనాతో మరణించిందని అందరిని నమ్మించి చివరకు బుక్కయ్యాడు.

vanastalipuram crime
వనస్థలిపురంలో భార్య హత్య కేసు

భార్య మీద తనకున్న అనుమానమే పెనుభూతమైంది. అర్ధాంగినే అంతమొందించే స్థాయికి చేరింది. తాను చేసిన కిరాతకాన్ని మూడో కంటికి తెలియకుండా కాలగర్భంలో కప్పిపెట్టేందుకు మహమ్మారి కరోనా పేరును ఉపయోగపడింది. అనుమానంతో భర్యను చంపేసి.. కరోనాతో మరణించిందని అందరిని నమ్మించాడు ఓ ప్రబుద్ధుడు. ఎవరినీ దగ్గరికి రాకుండా జాగ్రత్తపడి.. నిజం ఎక్కడా బయటపడకుండా అంత్యక్రియలు సైతం జరిపించాడు. అంతా అయిపోయిందనుకునే సమయంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు వచ్చి అనుమానంతో అసలు విషయం బయటపడింది.

అసలు ఏం జరిగిందంటే..

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం కమ్మగ్రామంలోని సుందరయ్యనగర్​ కాలనీకి చెందిన రమావత్​ విజయ్​ నాయక్​.. నల్లగొండ జిల్లా పిల్లగుంట్ల తండాకు చెందిన కవితను వివాహమాడాడు. ఆటో నడుపుతూ జీవనం కొనసాగించే విజయ్​.. పెళ్లి తర్వాత వనస్థలిపురంలోని వైదేహీనగర్​లో కాపురం పెట్టాడు. పెళ్లైన కొత్తలో భర్యను అపురూపంగా చూసుకున్నాడు. భార్య అందంగా ఉంటుందని మురిసిపోయే అతని ఆనందం కాస్తా.. రానురాను అభద్రతాభావంగా రూపాంతరం చెందింది. అది కాస్తా.. అనుమానపు విత్తును నాటింది. భార్య ఎవరితో ముచ్చటించినా.. ఫోన్​లో మాట్లాడినా.. అనుమానించటం మొదలుపెట్టాడు.

కరోనా వచ్చిందని నమ్మించి..

తన అందమే తనకు యమపాశమవుతుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు. తన సౌందర్యమైన రూపాన్ని చూసి వరించిన మొగుడే.. తనపాలిట యముడవుతాడని ఆ వివాహిత అంచనా వేసి ఉండదు. విజయ్​లో చిన్నగా మొదలైన అనుమానం పెనుభూతమైంది. తనలో ఉన్న భర్తను.. కిరాతకునిగా మార్చేసింది. భార్యను ఎలాగైనా చంపాలని నిశ్చయించుకున్నా విజయ్​.. పథకం రచించాడు. జూన్​ 18న భార్య పడుకున్న సమయంలో దిండుతో గాలాడకుండా చేసి హతమార్చాడు. ఈ నేరం బయటకురాకుండా చేయాలని విజయ్​ మరో ఎత్తు వేశాడు. కవితకు కరోనా వచ్చిందని.. పరిస్థితి విషమించి చనిపోయిందని.. ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు.

తన ఆటోలోనే కవిత మృతదేహాన్ని.. పిల్లగుంట్ల తండాకు తీసుకెళ్లాడు. కరోనా బారిన పడే కవిత చనిపోయిందని అందరినీ నమ్మించాడు విజయ్​. అంత్యక్రియలు చేసే సమయంలోనూ.. ఎవరూ దగ్గరికి రావొద్దని, వస్తే వారికి కూడా అంటుకుంటుందని భయపెట్టాడు. అప్పటికీ కొందరు సాయం చేసి.. అంత్యక్రియలు జరిపారు. "హమ్మయ్యా అంతా అయిపోయింది.. ఇక తన మీద ఎవరికి అనుమానం రాలేదు" అని విజయ్​ రిలాక్స్​ అయ్యాడు. అయితే అసలు కథ అప్పుడే మొదలైంది.

నెగెటివ్​ పరీక్షలతోనే అనుమానం..

అంత్యక్రియల్లో పాల్గొన్న కవిత తరఫు బంధువులు కరోనా పరీక్షలు చేయించుకోగా.. ఆరు రోజుల తర్వాత అందరికీ నెగెటివ్​గా తేలింది. కవిత తల్లిదండ్రులకు అసలు అనుమానం అప్పుడు మొదలైంది. వెంటనే వనస్థలిపురం ఆస్పత్రిలో కవితకు చేయించిన కరోనా పరీక్షకు సంబంధించిన రిపోర్టులపై ఆరా తీశారు. అవి నకిలీవని తేలటంతో.. నేరుగా పోలీసులను ఆశ్రయించారు. జరిగిందంతా పోలీసుల ముందుంచారు.

పోస్ట్​మార్టంతో వెలుగులోకి నిజం..

రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు మొదలు పెట్టారు. నేరుగా పిల్లగుంట్ల తండాకు వెళ్లారు. అక్కడి ఎమ్మార్వోతో మాట్లాడి.. పాతిపెట్టిన మృతదేహాన్ని.. మళ్లీ తవ్వి తీసేందుకు అనుమతి తీసుకున్నారు. కవిత మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. అక్కడి నుంచి పోస్టుమార్టానికి పంపించారు. పోస్ట్​మార్టం రిపోర్టులో.. కవిత మరణానికి కరోనాతో సంబంధం లేదని తేలింది. మెడ మీద గాయాలున్నాయని.. ఊపిరాడకుండానే చనిపోయినట్టు తేలటంతో.. విజయ్​ని అదుపులోకి తీసుకున్నారు. తమదైనశైలిలో విజయ్​ని పోలీసులు ప్రశ్నించగా.. అసలు విషయాన్ని బయటపెట్టాడు. నిందితున్ని అరెస్ట్​ చేసిన పోలీసులు.. కోర్టుకు తరలించి రిమాండ్​కు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

బ్యాంకుకు వెళ్లే మహిళలే టార్గెట్.. సీసీ కెమెరా ఉన్నా పట్టించుకోడు!

పోలీస్ స్టేషన్​లో.. దంపతుల ఆత్మహత్యాయత్నం

భార్య మీద తనకున్న అనుమానమే పెనుభూతమైంది. అర్ధాంగినే అంతమొందించే స్థాయికి చేరింది. తాను చేసిన కిరాతకాన్ని మూడో కంటికి తెలియకుండా కాలగర్భంలో కప్పిపెట్టేందుకు మహమ్మారి కరోనా పేరును ఉపయోగపడింది. అనుమానంతో భర్యను చంపేసి.. కరోనాతో మరణించిందని అందరిని నమ్మించాడు ఓ ప్రబుద్ధుడు. ఎవరినీ దగ్గరికి రాకుండా జాగ్రత్తపడి.. నిజం ఎక్కడా బయటపడకుండా అంత్యక్రియలు సైతం జరిపించాడు. అంతా అయిపోయిందనుకునే సమయంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు వచ్చి అనుమానంతో అసలు విషయం బయటపడింది.

అసలు ఏం జరిగిందంటే..

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం కమ్మగ్రామంలోని సుందరయ్యనగర్​ కాలనీకి చెందిన రమావత్​ విజయ్​ నాయక్​.. నల్లగొండ జిల్లా పిల్లగుంట్ల తండాకు చెందిన కవితను వివాహమాడాడు. ఆటో నడుపుతూ జీవనం కొనసాగించే విజయ్​.. పెళ్లి తర్వాత వనస్థలిపురంలోని వైదేహీనగర్​లో కాపురం పెట్టాడు. పెళ్లైన కొత్తలో భర్యను అపురూపంగా చూసుకున్నాడు. భార్య అందంగా ఉంటుందని మురిసిపోయే అతని ఆనందం కాస్తా.. రానురాను అభద్రతాభావంగా రూపాంతరం చెందింది. అది కాస్తా.. అనుమానపు విత్తును నాటింది. భార్య ఎవరితో ముచ్చటించినా.. ఫోన్​లో మాట్లాడినా.. అనుమానించటం మొదలుపెట్టాడు.

కరోనా వచ్చిందని నమ్మించి..

తన అందమే తనకు యమపాశమవుతుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు. తన సౌందర్యమైన రూపాన్ని చూసి వరించిన మొగుడే.. తనపాలిట యముడవుతాడని ఆ వివాహిత అంచనా వేసి ఉండదు. విజయ్​లో చిన్నగా మొదలైన అనుమానం పెనుభూతమైంది. తనలో ఉన్న భర్తను.. కిరాతకునిగా మార్చేసింది. భార్యను ఎలాగైనా చంపాలని నిశ్చయించుకున్నా విజయ్​.. పథకం రచించాడు. జూన్​ 18న భార్య పడుకున్న సమయంలో దిండుతో గాలాడకుండా చేసి హతమార్చాడు. ఈ నేరం బయటకురాకుండా చేయాలని విజయ్​ మరో ఎత్తు వేశాడు. కవితకు కరోనా వచ్చిందని.. పరిస్థితి విషమించి చనిపోయిందని.. ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు.

తన ఆటోలోనే కవిత మృతదేహాన్ని.. పిల్లగుంట్ల తండాకు తీసుకెళ్లాడు. కరోనా బారిన పడే కవిత చనిపోయిందని అందరినీ నమ్మించాడు విజయ్​. అంత్యక్రియలు చేసే సమయంలోనూ.. ఎవరూ దగ్గరికి రావొద్దని, వస్తే వారికి కూడా అంటుకుంటుందని భయపెట్టాడు. అప్పటికీ కొందరు సాయం చేసి.. అంత్యక్రియలు జరిపారు. "హమ్మయ్యా అంతా అయిపోయింది.. ఇక తన మీద ఎవరికి అనుమానం రాలేదు" అని విజయ్​ రిలాక్స్​ అయ్యాడు. అయితే అసలు కథ అప్పుడే మొదలైంది.

నెగెటివ్​ పరీక్షలతోనే అనుమానం..

అంత్యక్రియల్లో పాల్గొన్న కవిత తరఫు బంధువులు కరోనా పరీక్షలు చేయించుకోగా.. ఆరు రోజుల తర్వాత అందరికీ నెగెటివ్​గా తేలింది. కవిత తల్లిదండ్రులకు అసలు అనుమానం అప్పుడు మొదలైంది. వెంటనే వనస్థలిపురం ఆస్పత్రిలో కవితకు చేయించిన కరోనా పరీక్షకు సంబంధించిన రిపోర్టులపై ఆరా తీశారు. అవి నకిలీవని తేలటంతో.. నేరుగా పోలీసులను ఆశ్రయించారు. జరిగిందంతా పోలీసుల ముందుంచారు.

పోస్ట్​మార్టంతో వెలుగులోకి నిజం..

రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు మొదలు పెట్టారు. నేరుగా పిల్లగుంట్ల తండాకు వెళ్లారు. అక్కడి ఎమ్మార్వోతో మాట్లాడి.. పాతిపెట్టిన మృతదేహాన్ని.. మళ్లీ తవ్వి తీసేందుకు అనుమతి తీసుకున్నారు. కవిత మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. అక్కడి నుంచి పోస్టుమార్టానికి పంపించారు. పోస్ట్​మార్టం రిపోర్టులో.. కవిత మరణానికి కరోనాతో సంబంధం లేదని తేలింది. మెడ మీద గాయాలున్నాయని.. ఊపిరాడకుండానే చనిపోయినట్టు తేలటంతో.. విజయ్​ని అదుపులోకి తీసుకున్నారు. తమదైనశైలిలో విజయ్​ని పోలీసులు ప్రశ్నించగా.. అసలు విషయాన్ని బయటపెట్టాడు. నిందితున్ని అరెస్ట్​ చేసిన పోలీసులు.. కోర్టుకు తరలించి రిమాండ్​కు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

బ్యాంకుకు వెళ్లే మహిళలే టార్గెట్.. సీసీ కెమెరా ఉన్నా పట్టించుకోడు!

పోలీస్ స్టేషన్​లో.. దంపతుల ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.