విశాఖ జిల్లా మాడుగుల మండలం కూర్మనాథపురం కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పశ్చిమబంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ కారు పోలీసులను చూసి వెనక్కి మళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. దానిలో రూ.8 లక్షల విలువ చేసే 80 కేజీల గంజాయిని గుర్తించారు. ఈ కేసులో పశ్చిమ బంగాల్కు చెందిన భార్యా భర్తలతోపాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రామారావు చెప్పారు. కారు సీజ్ చేసిన పోలీసులు.. నిందితులు నుంచి 3 సెల్ ఫోన్లు, రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి..