కరోనాపై పోరు కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధికి విశాఖపట్నం పోర్టు ట్రస్టు కోటీ రూపాయల సాయం అందించింది. తమ సామాజిక బాధ్యత నిధుల నుంచి కోటి రూపాయలతో పాటుగా పోర్ట్ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం 62,28,296 రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు విశాఖ పోర్టు ఛైర్మన్ కె.రామమోహనరావు వెల్లడించారు. పోర్టు నుంచి మొత్తం 1,62,28,296 రూపాయల మొత్తాన్ని పీఎం కేర్స్ నిధికి అందజేసినట్లు చెప్పారు. మరోవైపు పోర్టులో పదవీ విరమణ చేసిన అధికారులు తమ సంక్షేమ సంఘం తీర్మానం మేరకు తమ పెన్షన్ నుంచి ఒక్కొక్కరు వెయ్యి రూపాయిలు విరాళం ఇచ్చేందుకు నిర్ణయించారు. ఆ మొత్తాన్ని వారి వినతి మేరకు పీఎం కేర్స్కు అందేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ చైర్మన్ హరనాథ్ వెల్లడించారు.
ఇదీ చదవండి