విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యోగులు ఈ నెల 6న తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. కొవిడ్ ఉద్ధృతి వల్ల సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కార్మిక సంఘాలు.. జూన్లో సమ్మె తేదీని నిర్ణయిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్లో సుమారు 30 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 15 మంది కాంట్రాక్టు కార్మికులు కొవిడ్ కారణంగా మరణించారని నేతలు వెల్లడించారు. జాతీయ స్థాయి కార్మిక సంఘాలతో కలిసి సమ్మె వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఇదీచదవండి