ETV Bharat / city

నేను కూడా కాపునే : ఎంపీ విజయసాయిరెడ్డి - నేను కాపునే అన్న విజయసాయిరెడ్డి

విశాఖలో ఆదివారం జరిగిన కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి హాజరవడంపై కొందరు కాపు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో విజయసాయిరెడ్డి తాను కాపునేనంటూ చేసిన వ్యాఖ్యలపై కొందరు నేతలు అసహనం వెలిబుచ్చారు. కాపు సమ్మేళనానికి వేరే వారు రావడంపై మంత్రి శ్రీనివాస్​ను కాపు నేతలు నిలదీశారు.

vijay sai reddy
విజయసాయిరెడ్డి
author img

By

Published : Dec 16, 2019, 2:55 PM IST

కాపు సమ్మేళనానికి విజయసాయిరెడ్డి రావడంపై ఆ సంఘం నాయకుల అభ్యంతరం
విశాఖలో జరిగిన కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రావడంపై... కొందరు కాపు నేతలు అసహనం వ్యక్తం చేశారు. సమ్మేళనంలో మాట్లాడిన విజయసాయిరెడ్డి తాను కూడా కాపునేనని, తన పదో తరగతి ధ్రువపత్రంలో తన కులం కాపు అనే రాసి ఉందన్నారు. నెల్లూరు ప్రాంతంలో కులం ఏదైనా కాపు అనే సర్టిఫికెట్​లో రాస్తారన్నారు. విజయసాయిరెడ్డి ప్రసంగం పూర్తై వెళ్లిపోయాక.. కొందరు నేతలు వేదికపై ఉన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును నిలదీశారు. కాపు సమ్మేళనానికి వేరే వారు ఎందుకొచ్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వేదికపై ఉన్నవారు.. ఎంపీని ఆహ్వానించలేదని సర్దిచెప్పినా కొంతసేపు గందరగోళం నెలకొంది.

ఇదీ చదవండి:

'కష్టపడే నాయకులు, కార్యకర్తలు ఉన్నంతకాలం తెదేపాకు ఏమీ కాదు'

కాపు సమ్మేళనానికి విజయసాయిరెడ్డి రావడంపై ఆ సంఘం నాయకుల అభ్యంతరం
విశాఖలో జరిగిన కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రావడంపై... కొందరు కాపు నేతలు అసహనం వ్యక్తం చేశారు. సమ్మేళనంలో మాట్లాడిన విజయసాయిరెడ్డి తాను కూడా కాపునేనని, తన పదో తరగతి ధ్రువపత్రంలో తన కులం కాపు అనే రాసి ఉందన్నారు. నెల్లూరు ప్రాంతంలో కులం ఏదైనా కాపు అనే సర్టిఫికెట్​లో రాస్తారన్నారు. విజయసాయిరెడ్డి ప్రసంగం పూర్తై వెళ్లిపోయాక.. కొందరు నేతలు వేదికపై ఉన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును నిలదీశారు. కాపు సమ్మేళనానికి వేరే వారు ఎందుకొచ్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వేదికపై ఉన్నవారు.. ఎంపీని ఆహ్వానించలేదని సర్దిచెప్పినా కొంతసేపు గందరగోళం నెలకొంది.

ఇదీ చదవండి:

'కష్టపడే నాయకులు, కార్యకర్తలు ఉన్నంతకాలం తెదేపాకు ఏమీ కాదు'

Ap_vsp_05_16_vijaya_sai_reddy_on_kapu_av_3031531 Anchor : తానూ కాపు నేననే రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి అన్నారు. తన పదో తరగతి ధ్రువ పత్రంలో కులం చోట కాపు అని రాసి ఉందని వివరించారు.విశాఖలో జరిగిన కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయికకు విజయ సాయి ని రావడం పై కొంత గందరగోళం జరిగింది. విజయ సాయి ప్రసంగం ముగించి వెళ్లి పోయాక మంత్రి ముత్తంశెట్టి ని కాపు నాయకులు నిలదీశారు.తాము ఆహ్వానించలేదని వేదిక పై ఉన్నవారు సర్దిచెప్పనా కొంతసేపు గందరగోళం కొనసాగింది. స్పాట్.... నోట్ : ఇది నిన్న జరిగింది. వీడియో మాత్రం ఈ ఉదయం బయటకు షేర్ అయ్యింది. ఈనాడులో వార్త ఇచ్చారు. రాజేంద్ర గారికి చెప్పి అవసరం అనుకుంటే వాడగలరు. ఫీడ్ డెస్క్ వాట్సాప్ కి పంపాము.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.