ETV Bharat / city

'తప్పుచేయకుంటే.. సీఎం జగన్​కు భయమెందుకు'

author img

By

Published : Feb 27, 2020, 4:09 PM IST

చంద్రబాబు విశాఖ పర్యటన అడ్డుకోవడంపై తెదేపా సీనియర్​ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న విశాఖ నగరంలో అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేయకుంటే సీఎం జగన్​కు భయమెందుకని తెదేపా నేత కేఈ కృష్ణమూర్తి ప్రశ్నించారు. చంద్రబాబు కాన్వాయ్​పై వైకాపా దాడికి పాల్పడటం హేయమైన చర్యగా యనమల రామకృష్ణుడు అభివర్ణించారు. గంటల తరబడి మాజీ సీఎంను ఎయిర్ పోర్టు వద్దే ఎలా నిలిపేస్తారని నిలదీశారు. పోలీసులున్నది చోద్యం చూడటానికి కాదని యనమల అన్నారు.

tdp leaders fires on ysrcp
వైకాపాపై తెదేపా నేతలు మండిపాటు

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.