ETV Bharat / city

'మంత్రి పదవికి కొడాలి నాని రాజీనామా చేయాలి' - మంత్రి నానిపై తెదేపా నేతల ఫైర్ వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి యనమల గురించి... మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. కొడాలి నాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

TDP leaders fire on minister kodali nani
author img

By

Published : Nov 17, 2019, 11:03 PM IST

'మంత్రి పదవికి కొడాలి నాని రాజీనామా చేయాలి'

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల పట్ల తెదేపా నేతలు భగ్గుమన్నారు. మాజీమంత్రి యనమలను నిందించే స్థాయి కొడాలికి లేదని... తక్షణమే బేషరతుగా క్షమాపణాలు చెప్పాలని మాజీఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు డిమాండ్ చేశారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి... ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని... తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక... రాష్ట్రాభివృద్ధి అధోగతి పాలైందని విమర్శించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును అసభ్యపదజాలంతో సంబోంధిచడం సరికాదని హితవు పలికారు.

ఇదీ చదవండి : 'జగన్ మెప్పు కోసమే... కొడాలి నాని ఆరాటం'

'మంత్రి పదవికి కొడాలి నాని రాజీనామా చేయాలి'

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల పట్ల తెదేపా నేతలు భగ్గుమన్నారు. మాజీమంత్రి యనమలను నిందించే స్థాయి కొడాలికి లేదని... తక్షణమే బేషరతుగా క్షమాపణాలు చెప్పాలని మాజీఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు డిమాండ్ చేశారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి... ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని... తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక... రాష్ట్రాభివృద్ధి అధోగతి పాలైందని విమర్శించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును అసభ్యపదజాలంతో సంబోంధిచడం సరికాదని హితవు పలికారు.

ఇదీ చదవండి : 'జగన్ మెప్పు కోసమే... కొడాలి నాని ఆరాటం'

Intro:Ap_Vsp_92_17_Ex_Mla_Mlc_On_Kodali_Nani_Abb_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను విశాఖ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఖండించారు.


Body:నగర తెదేపా కార్యాలయంలో వారు మాట్లాడారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ దుర్భాషలాడడం తగదని పల్లా అన్నారు. మాజీ మంత్రి యనమలను నిందించే స్థాయి కొడాలి లేదని.. తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పి.. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


Conclusion:వైకాపా అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాష్ట్రం అధోగతి పాలయ్యిందని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. అమరావతి విషయంలో కూడా అయోమయంలోకి ప్రజల్ని నెట్టారని అన్నారు. తెదేపా అధినేతను వాడు వీడు అని సంభోదించడం సరికాదని.. తక్షణమే క్షమాపణలు చెప్పకపోతే బీసీలంతా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

బైట్: పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే.
బైట్: దువ్వారపు రామారావు, ఎమ్మెల్సీ.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.