ETV Bharat / city

సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం రూ. 82.43 లక్షలు

సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయాన్ని సోమవారం ఆలయ ఈవో సమక్షంలో లెక్కించారు. లాక్​డౌన్​ అనంతరం స్వామి వారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు పేర్కొన్నారు.

author img

By

Published : Oct 5, 2020, 11:33 PM IST

simhachalam temple hundi collection counting
సింహాచలం హుండీ ఆదాయం లెక్కింపు

సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం సోమవారం ఆలయ ఈవో త్రినాధరావు సమక్షంలో లెక్కించారు. 33 రోజులకు గాను రూ. 82.43 లక్షల నగదు రూపాయలు, 43 గ్రాముల బంగారు, ఆరు కేజీల వెండిని... భక్తులు కానుకగా స్వామి వారికి సమర్పించారు.

స్వామివారి ఆదాయం లాక్​డౌన్​ అనంతరం గణనీయంగా పెరిగింది. ఎక్కువ మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడమే కాకుండా ప్రత్యక్ష పూజలు చేయించుకోవడం వల్ల ఈ ఫలితం వచ్చింది. రానున్న రోజుల్లో మరింత ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు.

సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం సోమవారం ఆలయ ఈవో త్రినాధరావు సమక్షంలో లెక్కించారు. 33 రోజులకు గాను రూ. 82.43 లక్షల నగదు రూపాయలు, 43 గ్రాముల బంగారు, ఆరు కేజీల వెండిని... భక్తులు కానుకగా స్వామి వారికి సమర్పించారు.

స్వామివారి ఆదాయం లాక్​డౌన్​ అనంతరం గణనీయంగా పెరిగింది. ఎక్కువ మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడమే కాకుండా ప్రత్యక్ష పూజలు చేయించుకోవడం వల్ల ఈ ఫలితం వచ్చింది. రానున్న రోజుల్లో మరింత ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు.

ఇదీ చదవండి:

సింహాద్రి అప్పన్న ఆలయానికి పెరుగుతున్న భక్తుల తాకిడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.