గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ తెదేపా అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును చంద్రబాబు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడం ఖాయమని.. తమ విజయాన్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలోని పెందుర్తి కూడలిలో ఆయన మాట్లాడారు. పీలా శ్రీనివాస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఎన్నికల్లో తెదేపాకు బ్రహ్మాండమైన గెలుపును అందించాలని ప్రజలను కోరారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని ఎంతో కృషి చేశానన్నారు.
ఇదీ చదవండీ... 'నన్ను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నారు'