ETV Bharat / city

ఉత్తరాంధ్రలో పాక్ ఉగ్రవాది అరెస్టు...! - విశాఖలో పాక్ టెర్రరిస్ట్ అరెస్ట్

చెన్నై-కోల్​కత్తా మార్గంలో ఓ పాక్ ఉగ్రవాది పారిపోతున్నాడన్న సమాచారం రాష్ట్ర పోలీసుల్లో కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు... శ్రీకాకుళం జిల్లా కవిటి వద్ద ఉగ్రవాదిని చాకచక్యంగా పట్టుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టుగా సమాచారం. విషయాన్ని పోలీసు వర్గాలు ధృవీకరించలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) పరిధిలో అంశం కావడం వల్ల పోలీసులు సమాచారాన్ని గోప్యంగా ఉంచారు.

pak terror suspect arrested in north Andhra
ఉత్తరాంధ్రలో పాక్ ఉగ్రవాది పట్టివేత...!
author img

By

Published : Jan 13, 2020, 11:05 PM IST

Updated : Jan 14, 2020, 12:20 AM IST


మారువేషంలో ఉత్తరాంధ్ర మీదుగా పారిపోతున్న ఓ పాక్ ఉగ్రవాదిని రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారన్న సమాచారం సంచలనం రేపుతుంది. ముంబయి నుంచి కోల్​కత్తా వెళ్తోన్న ఓ లారీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తే హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును విచారిస్తున్న అధికారి... అనుమానితుడు ఉగ్రవాదని పసిగట్టారు. సమాచారాన్ని ఎన్​ఐఏ సంస్థకు చేరవేశారు. ఉగ్రవాది ప్రయాణించిన లారీ సమాచారాన్ని విశాఖ పోలీసులకు అందజేశారు. అప్పటికే లారీ విశాఖ జిల్లా దాటిపోవటంతో.. శ్రీకాకుళం జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. నిన్న అర్ధరాత్రి సోదాలు చేస్తుండగా ఉగ్రవాది ప్రయాణిస్తున్న లారీని పోలీసులు గుర్తించారు.


ఈ వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో అనుమానిత ఉగ్రవాది పాక్ ఏజెంట్​గా భావిస్తున్న వ్యక్తి కూడా ఉన్నట్టు సమాచారం. అనుమానిత వ్యక్తిని విశాఖకు తీసుకువచ్చి...రహస్యప్రదేశంలో ఎన్​ఐఏ విచారిస్తున్నట్టుగా సమాచారం. ఈ విషయమై పోలీసు అధికారులు, ఎన్​ఐఏ వర్గాలు ఇంతవరకు ఎటువంటి ధృవీకరణ చేయలేదు.


మారువేషంలో ఉత్తరాంధ్ర మీదుగా పారిపోతున్న ఓ పాక్ ఉగ్రవాదిని రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారన్న సమాచారం సంచలనం రేపుతుంది. ముంబయి నుంచి కోల్​కత్తా వెళ్తోన్న ఓ లారీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తే హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును విచారిస్తున్న అధికారి... అనుమానితుడు ఉగ్రవాదని పసిగట్టారు. సమాచారాన్ని ఎన్​ఐఏ సంస్థకు చేరవేశారు. ఉగ్రవాది ప్రయాణించిన లారీ సమాచారాన్ని విశాఖ పోలీసులకు అందజేశారు. అప్పటికే లారీ విశాఖ జిల్లా దాటిపోవటంతో.. శ్రీకాకుళం జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. నిన్న అర్ధరాత్రి సోదాలు చేస్తుండగా ఉగ్రవాది ప్రయాణిస్తున్న లారీని పోలీసులు గుర్తించారు.


ఈ వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో అనుమానిత ఉగ్రవాది పాక్ ఏజెంట్​గా భావిస్తున్న వ్యక్తి కూడా ఉన్నట్టు సమాచారం. అనుమానిత వ్యక్తిని విశాఖకు తీసుకువచ్చి...రహస్యప్రదేశంలో ఎన్​ఐఏ విచారిస్తున్నట్టుగా సమాచారం. ఈ విషయమై పోలీసు అధికారులు, ఎన్​ఐఏ వర్గాలు ఇంతవరకు ఎటువంటి ధృవీకరణ చేయలేదు.

ఇదీ చదవండి :

జేఎన్​యూ ఘటనపై వాట్సాప్​కు దిల్లీ హైకోర్టు నోటీసులు

sample description
Last Updated : Jan 14, 2020, 12:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.