ETV Bharat / city

విశాఖ విమానాశ్రయంలో అందుబాటులోకి కొత్త టాక్సీ వే

విశాఖ ఎయిర్ పోర్టులో కొత్త టాక్సీ వేను తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా ప్రారంభించారు. విమానాశ్రయంలో ఆధునీకరణ, అభివృద్ది పనులలో భాగంగా ఈ టాక్సీ వేకు రూపకల్పన చేశారు.

author img

By

Published : Aug 16, 2021, 10:36 PM IST

New taxiway start at Visakhapatnam Airport
విశాఖ విమానాశ్రయంలో అందుబాటులోకి కొత్త టాక్సీ వే

విశాఖ విమానాశ్రయంలో కొత్త టాక్సీ వే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఎన్-3, ఎన్-4కి అదనంగా ఎన్-5 టాక్సీ వే కూడా సేవలు అందించనుంది. దీన్ని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా ప్రారంభించారు. ఫలితంగా ఎయిర్ పోర్టులో రద్దీ సమయంలో మరిన్ని వాణిజ్య విమానాల రాకపోకలు సదుపాయం ఏర్పడింది.

విశాఖ విమానాశ్రయం తూర్పునౌకాదళం నియంత్రణలో ఉంది. ఒకవైపు రక్షణ అవసరాల విన్యాసాలకు విమానాల కోసం వినియోగిస్తూనే.. పౌర విమానాలను ఈ ఎయిర్ పోర్టులో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటివరకు రద్దీ సమయంలోనూ విమానాల రాకపోకలకు ఈ అదనపు సదుపాయం ఉపకరిస్తుంది. విమానాశ్రయం ఆధునీకరణ, అభివృద్ది పనులలో భాగంగా ఈ టాక్సీ వేకు రూపకల్పన చేశారు.

మొత్తం రూ. 30కోట్ల 12 లక్షల వ్యయాన్ని దీని అభివృద్దికి ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా ఖర్చు చేసింది. గతంలో ఏకకాలంలో 9 విమానాలు రావడానికి వెళ్లడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 12కు చేరుకుంది. అలాగే.. అదనంగా ఆరు విమానాలను నిలుపుకునేందుకు వీలవుతుంది. ఫలితంగా రాత్రి వేళ్లలో విమానాల పార్కింగ్ సదుపాయం కూడా విస్తరించినట్ల అయింది.

విశాఖ విమానాశ్రయంలో కొత్త టాక్సీ వే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఎన్-3, ఎన్-4కి అదనంగా ఎన్-5 టాక్సీ వే కూడా సేవలు అందించనుంది. దీన్ని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా ప్రారంభించారు. ఫలితంగా ఎయిర్ పోర్టులో రద్దీ సమయంలో మరిన్ని వాణిజ్య విమానాల రాకపోకలు సదుపాయం ఏర్పడింది.

విశాఖ విమానాశ్రయం తూర్పునౌకాదళం నియంత్రణలో ఉంది. ఒకవైపు రక్షణ అవసరాల విన్యాసాలకు విమానాల కోసం వినియోగిస్తూనే.. పౌర విమానాలను ఈ ఎయిర్ పోర్టులో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటివరకు రద్దీ సమయంలోనూ విమానాల రాకపోకలకు ఈ అదనపు సదుపాయం ఉపకరిస్తుంది. విమానాశ్రయం ఆధునీకరణ, అభివృద్ది పనులలో భాగంగా ఈ టాక్సీ వేకు రూపకల్పన చేశారు.

మొత్తం రూ. 30కోట్ల 12 లక్షల వ్యయాన్ని దీని అభివృద్దికి ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా ఖర్చు చేసింది. గతంలో ఏకకాలంలో 9 విమానాలు రావడానికి వెళ్లడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 12కు చేరుకుంది. అలాగే.. అదనంగా ఆరు విమానాలను నిలుపుకునేందుకు వీలవుతుంది. ఫలితంగా రాత్రి వేళ్లలో విమానాల పార్కింగ్ సదుపాయం కూడా విస్తరించినట్ల అయింది.

ఇదీ చదవండి..

డ్యాంల పరిరక్షణకు 315 మంది నియామకానికి కసరత్తు: మంత్రి అనిల్ కుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.