NEDCAP Chairman fired on GVMC : విశాఖ మహా నగర పాలక సంస్థ అధికారులపై రాష్ట్ర నెడ్ క్యాప్ ఛైర్మన్ కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కైలాసపురం నుంచి ఎన్ జీవో కాలనీకి వెళ్లే రోడ్డుపైన చెత్త పోయడంపై జీవీఎంసీ కమిషనర్కు నెడ్ క్యాప్ ఛైర్మన్ కేకే రాజు ఫిర్యాదు చేశారు. ఒక పక్క స్వచ్ఛ విశాఖ అని నినాదం ఇస్తుంటే.. మరో పక్క అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు.
పరదేశిపాలెం తీసుకుని వెళ్లాల్సిన చెత్తను నగర రోడ్ల మీద పోసేసి వెళ్లారన్నారు. చెత్తను తొలగించే వరకు నిరీక్షించారు. అధికారుల నిర్లక్ష్యంపై జీవీఎంసీ కమిషనర్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి :