ETV Bharat / city

రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నా.. సవాల్​కు సిద్ధమా?: వెలగపూడి

వైకాపా నేతలు కబ్జా చేయడానికే ఆక్రమణలు తొలగిస్తున్నారని.. వాటిని తన బినామి ఆస్తులుగా చూపిస్తూ.. ఆరోపణలు చేస్తున్నారని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎంవీపీ కాలనీలో ఒకే ఫ్లాట్ ఉందని.. తనపై, తన కుటుంబ సభ్యుల పేరు మీద సెంటు స్థలం లేదని స్పష్టం చేశారు.

author img

By

Published : Dec 24, 2020, 3:41 PM IST

రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నా.. సవాల్​కు సిద్ధమా?: వెలగపూడి
రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నా.. సవాల్​కు సిద్ధమా?: వెలగపూడి

వైకాపా నేతలు తనపై చేసిన ఆరోపణలపై నిజాయితీగా విచారణ చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. తన సచ్చీలతను నిరూపించుకుంటూ.. ఈస్ట్ పోయింట్ కాలనీలో వున్న షిరిడీ సాయి బాబా గుడిలో ప్రమాణం చేస్తానని అన్నారు. బాబా కోవెలకు ఎప్పుడు విజయసాయి రెడ్డి వస్తారో చెప్తే తాను వస్తానని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు విజయసాయిరెడ్డి నిరూపించకపోతే రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక వేళ తన బినామీలదే స్థలమని రుజువైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెలగపూడి సవాల్ విసిరారు. రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నానే తప్ప ఒక్క రూపాయి కూడా సంపాదించకున్నది లేదని రామకృష్ణబాబు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

వైకాపా నేతలు తనపై చేసిన ఆరోపణలపై నిజాయితీగా విచారణ చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. తన సచ్చీలతను నిరూపించుకుంటూ.. ఈస్ట్ పోయింట్ కాలనీలో వున్న షిరిడీ సాయి బాబా గుడిలో ప్రమాణం చేస్తానని అన్నారు. బాబా కోవెలకు ఎప్పుడు విజయసాయి రెడ్డి వస్తారో చెప్తే తాను వస్తానని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు విజయసాయిరెడ్డి నిరూపించకపోతే రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక వేళ తన బినామీలదే స్థలమని రుజువైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెలగపూడి సవాల్ విసిరారు. రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నానే తప్ప ఒక్క రూపాయి కూడా సంపాదించకున్నది లేదని రామకృష్ణబాబు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

'ఇళ్ల పట్టాల పేరుతో రూ.6500 కోట్ల అవినీతి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.