వైకాపా నేతలు తనపై చేసిన ఆరోపణలపై నిజాయితీగా విచారణ చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. తన సచ్చీలతను నిరూపించుకుంటూ.. ఈస్ట్ పోయింట్ కాలనీలో వున్న షిరిడీ సాయి బాబా గుడిలో ప్రమాణం చేస్తానని అన్నారు. బాబా కోవెలకు ఎప్పుడు విజయసాయి రెడ్డి వస్తారో చెప్తే తాను వస్తానని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు విజయసాయిరెడ్డి నిరూపించకపోతే రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక వేళ తన బినామీలదే స్థలమని రుజువైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెలగపూడి సవాల్ విసిరారు. రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నానే తప్ప ఒక్క రూపాయి కూడా సంపాదించకున్నది లేదని రామకృష్ణబాబు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: