ETV Bharat / city

Avanthi Srinivas: 'స్వామివారి కృపతో పంచగ్రామాల సమస్య తీరుతుంది' - సింహాచలం నృసింహస్వామిని దర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

సింహాద్రి అప్పన్నను మంత్రి అవంతి శ్రీనివాసరావు(Minister Avanthi Srinivas) దర్శించుకున్నారు. ఈ సందర్బంగా దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి అన్నారు.

Minister Avanthi
అప్పన్న సేవలో మంత్రి అవంతి
author img

By

Published : Jun 19, 2021, 3:40 PM IST

సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని మంత్రి అవంతి శ్రీనివాసరావు(Minister Avanthi Srinivas) దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు.

స్వామివారి కృపతో కొవిడ్ సమస్యతోపాటు..పంచగ్రామాల భూసమస్య తీరిపోతుందని మంత్రి తెలిపారు. దేవస్థానం అభివృద్ధి విషయంలో ఈవో సూర్యకళ విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఆమెకు అందరూ సహకరించాలని కోరారు. భక్తులకు మరిన్ని వసతి గదులు అందుబాటులోకి తేవాలని ఈవోకు సూచించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని మంత్రి అవంతి శ్రీనివాసరావు(Minister Avanthi Srinivas) దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు.

స్వామివారి కృపతో కొవిడ్ సమస్యతోపాటు..పంచగ్రామాల భూసమస్య తీరిపోతుందని మంత్రి తెలిపారు. దేవస్థానం అభివృద్ధి విషయంలో ఈవో సూర్యకళ విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఆమెకు అందరూ సహకరించాలని కోరారు. భక్తులకు మరిన్ని వసతి గదులు అందుబాటులోకి తేవాలని ఈవోకు సూచించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

కేంద్రం నుంచి నిధులు రాకపోయినా.. రైతులకు చెల్లించాం: కొడాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.