విశాఖ సింహాచలం శ్రీవరాహనృసింహస్వామి దేవస్థానంలో ఈ-హుండీ సదుపాయం కల్పించినట్లు ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు. దూర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారికి కానుకలు, విరాళాలు సమర్పించాలనుకుంటే ఈ-హుండీని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర దేవాదాయ శాఖ రూపొందించిన వెబ్సైట్ www.tmc.ap.gov.in లోని ఈ- హుండీ ఆప్షన్ ద్వారా విరాళాలు అందజేయవచ్చని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు భక్తులు ఆన్ లైన్లో విరాళాలు అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఈ-హుండీ సదుపాయం అమల్లోకి తెచ్చింది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమవ్వడంతో రాష్ట్రంలోని 12 దేవాలయాల్లో ఈ సదుపాయం కల్పించింది.
ఇదీ చదవండి: అన్నవరం దేవాలయంలో ఈ-హుండీ ఏర్పాటు