విశాఖ నగరంలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భారతి ట్రస్ట్, బుల్లయ్య కళాశాల సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాజారత్నం హాజరయ్యారు. సుశిక్షితులైన డ్రైవర్ల కొరత ఉందని రాజారత్నం పేర్కొన్నారు. రహదారి నిబంధనలు శిక్షణ ద్వారా తెలుసుకున్న వారికి మంచి ఉపాధి లభిస్తుందని ఆయన సూచించారు.
ఇదీ చదవండి :