ETV Bharat / city

సీఎంను విమర్శించిన అయ్యన్నపై కేసు

ముఖ్యమంత్రి పాలనపై తీవ్ర ఆరోపణలు చేసినందుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

author img

By

Published : Sep 28, 2019, 6:40 AM IST

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు

మాజీ మంత్రి, తెదేపా నాయకుడు అయన్నపాత్రుడిపై విశాఖ మూడో పట్టణ పోలీసులు ఈ నెల 25న కేసు నమోదు చేసిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. జగన్​మోహన్​రెడ్డి ముఖ్యమంత్రి అయితే రౌడీరాజ్యమవుతుందని తాము ముందే చెప్పామని ఈ నెల 24న విశాఖ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖ పోలీసులపైనా ఘాటుగా విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిని విమర్శించడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. సెక్షన్​ 153ఏ, సెక్షన్​ 500, సెక్షన్​ 506 కింద కేసు నమోదు చేశారు. దీన్ని గుట్టుగా ఉంచారు. శుక్రవారం ఇది వెలుగులోకి రావడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాంతాల మధ్య సామాజిక వర్గాల మధ్య చిచ్చురేపేలా వ్యాఖ్యలు చేశారని డీసీపీ-1 ఎస్​. రంగారావు తెలిపారు. సీఎంపైనా తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. అయ్యన్న వ్యాఖ్యలపై ఎ. వెంకటరావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వివరించారు.

ఇదీ చదవండి :

మాజీ మంత్రి, తెదేపా నాయకుడు అయన్నపాత్రుడిపై విశాఖ మూడో పట్టణ పోలీసులు ఈ నెల 25న కేసు నమోదు చేసిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. జగన్​మోహన్​రెడ్డి ముఖ్యమంత్రి అయితే రౌడీరాజ్యమవుతుందని తాము ముందే చెప్పామని ఈ నెల 24న విశాఖ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖ పోలీసులపైనా ఘాటుగా విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిని విమర్శించడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. సెక్షన్​ 153ఏ, సెక్షన్​ 500, సెక్షన్​ 506 కింద కేసు నమోదు చేశారు. దీన్ని గుట్టుగా ఉంచారు. శుక్రవారం ఇది వెలుగులోకి రావడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాంతాల మధ్య సామాజిక వర్గాల మధ్య చిచ్చురేపేలా వ్యాఖ్యలు చేశారని డీసీపీ-1 ఎస్​. రంగారావు తెలిపారు. సీఎంపైనా తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. అయ్యన్న వ్యాఖ్యలపై ఎ. వెంకటరావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వివరించారు.

ఇదీ చదవండి :

విశాఖ ప్రెస్ క్లబ్​లో 'జర్నలిస్టుల చట్టాలు-ఆవశ్యకత'పై సదస్సు

Intro:ap_vsp_114_27_poshakahara_masosthavam_gov_whip_m.l.a_av_ap10152 సెంటర్ - మాడుగుల ఫోన్ నంబర్ - 8008574742 పేరు - సూర్యనారాయణ ఆరోగ్యమైన జీవనానికి పోషకాహారం ఎంతో అవసరం విశాఖపట్నం జిల్లా చీడికాడ మండల పరిషత్ కార్యలయంలో ఐ.సి.డి.ఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవం జరిగింది. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ముత్యాలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై సభలో మాట్లాడుతూ అంగనవాడి బలోపేతానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉంటారన్నారు. అంగన్వాడీ కేంద్రాలను గర్భిణీలు, బాలింతలు ఉపయోగించుకోవాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యమైన జీవనానికి పోషకాహారం ఎంతో అవసరమన్నారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన చేశారు. విధుల్లో ప్రతిభ చూపిన అంగన్వాడీ కార్యకర్తలకు బహుమతులు అందజేశారు. అనంతరం సీమంతాలు జరిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పోషకాహార పదార్థాలతో తయారుచేసిన వంటకాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ అనంతలక్ష్మి అధికారులు అంగన్వాడీ కార్యకర్త పాల్గొన్నారు.


Body:మాడుగుల


Conclusion:8008574742
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.