ETV Bharat / city

'ఇలాంటి నియంతృత్వ పాలన ఎప్పడూ చూడలేదు'

author img

By

Published : Oct 7, 2020, 10:19 PM IST

రాష్ట్రంలో ఇలాంటి నియంతృత్వ పాలన ఎప్పుడూ చూడలేదని.. భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ప్రజావేదిక కూల్చడంతో వైకాపా నియంతృత్వ పాలన మొదలైందని ధ్వజమెత్తారు.

BJP Vshnukumar Raju Fires on Jagan over ruling
విష్ణుకుమార్

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇలాంటి నియంతృత్వ పాలన ఎప్పుడూ లేదని భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం జగన్​మోహన్ రెడ్డి పాలన ప్రజావేదికని కూలగొట్టడం నుంచి ప్రారంభమైందన్నారు. సీఎం జగన్ నియంతృత్వ పాలన విడనాడాలని సూచించారు.

రైతులను కాపాడేందుకే దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నూతన వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చారని వివరించారు. దళారుల నుంచి రైతులను కాపాడేందుకు ఈ వ్యవసాయ బిల్లును తీసుకొస్తే... ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇలాంటి నియంతృత్వ పాలన ఎప్పుడూ లేదని భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం జగన్​మోహన్ రెడ్డి పాలన ప్రజావేదికని కూలగొట్టడం నుంచి ప్రారంభమైందన్నారు. సీఎం జగన్ నియంతృత్వ పాలన విడనాడాలని సూచించారు.

రైతులను కాపాడేందుకే దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నూతన వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చారని వివరించారు. దళారుల నుంచి రైతులను కాపాడేందుకు ఈ వ్యవసాయ బిల్లును తీసుకొస్తే... ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

'ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.