ETV Bharat / city

'రివర్స్ టెండరింగ్ కాదు... రివర్స్ పాలన జరుగుతోంది' - polavarm project latest news

కేంద్రం నిధులు ఇస్తుంటే కనీసం వినియోగించుకోలేని స్థితిలో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఉందని భాజపానేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఇళ్ల విషయంలో జరిగిన ఆక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

bjp-leader-vishnuvardhan-reddy
భాజపానేత విష్ణువర్ధన్ రెడ్డి
author img

By

Published : Nov 3, 2020, 1:44 PM IST


కేంద్రం నిధులు ఇస్తున్నా పోలవరం పూర్తి చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి జరిగి భాజపాకు పేరు వచ్చే సమయంలో... రాష్ట్రంలోని అధికార విపక్షాలు కేంద్రంపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ పై వేసిన సాంకేతిక కమిటీ, పోలవరం అథారిటీలు నిర్మాణ వ్యయం ఇతర అంశాలు పరిశీలిస్తారని చెప్పారు.

కమిషన్ కోసం కక్కుర్తి పడే పార్టీలు కేంద్రంలో ఉన్న భాజపాను విమర్శించే నైతికత వాటికి లేదన్నారు. ఇప్పుడు లేఖలు రాస్తున్నవారు పోలవరానికి నిధులు ఇచ్చినప్పుడు అభినందిస్తూ లేఖ ఎందుకు రాయలేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో రివర్స్‌ టెండరింగ్‌ కాదని... రివర్స్‌ పాలన సాగుతోందన్నారు విష్ణువర్దన్‌రెడ్డి.


కేంద్రం నిధులు ఇస్తున్నా పోలవరం పూర్తి చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి జరిగి భాజపాకు పేరు వచ్చే సమయంలో... రాష్ట్రంలోని అధికార విపక్షాలు కేంద్రంపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ పై వేసిన సాంకేతిక కమిటీ, పోలవరం అథారిటీలు నిర్మాణ వ్యయం ఇతర అంశాలు పరిశీలిస్తారని చెప్పారు.

కమిషన్ కోసం కక్కుర్తి పడే పార్టీలు కేంద్రంలో ఉన్న భాజపాను విమర్శించే నైతికత వాటికి లేదన్నారు. ఇప్పుడు లేఖలు రాస్తున్నవారు పోలవరానికి నిధులు ఇచ్చినప్పుడు అభినందిస్తూ లేఖ ఎందుకు రాయలేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో రివర్స్‌ టెండరింగ్‌ కాదని... రివర్స్‌ పాలన సాగుతోందన్నారు విష్ణువర్దన్‌రెడ్డి.

ఇదీ చదవండి:

'అన్ని రాష్ట్రాల్లో రైతులకు సన్మానాలు చేస్తుంటే...ఏపీలో మాత్రం బేడీలు వేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.