ETV Bharat / city

ఎస్సీ యువకుడి లాకప్​డెత్​... మధ్యవర్తితో రాజీయత్నం...!

author img

By

Published : Oct 3, 2020, 4:15 AM IST

Updated : Oct 3, 2020, 6:44 AM IST

విజయవాడలో ఎస్సీ యువకుడి లాకప్​డెత్ మరో మలుపు తిరిగింది. మధ్యవర్తి ద్వారా బాధిత కుటుంబ సభ్యులతో అధికారులు రాజీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం అక్రమ రవాణాలో నిందితుడిగా ఉన్న అజయ్​ను ఎస్​ఈబీ అధికారులు గురువారం విచారించారు. ఆ రోజు సాయంత్రమే అజయ్​ మృతి చెందారు. పోలీసుల దెబ్బల వల్లే యువకుడు మృతి చెందాడని ఎస్సీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గుండెపోటు వల్ల అజయ్ చనిపోయాడని పోలీసులు అంటున్నారు. శవపరీక్షలో వైద్యులు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు.

ఎస్సీ యువకుడి లాకప్​డెత్
ఎస్సీ యువకుడి లాకప్​డెత్

విజయవాడలో ఎస్సీ యువకుడి లాకప్‌డెత్‌ కేసు మరో మలుపు తిరిగింది. బాధిత కుటుంబంతో రాజీ కుదుర్చుకునేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. అక్రమంగా మద్యం రవాణా చేసిన కేసులో 11వ నిందితుడిగా ఉన్న డోవారి అజయ్‌ను ఎస్​ఈబీ పోలీసులు గురువారం విచారణ నిమిత్తం తీసుకెళ్లగా ఠాణాలో మృతి చెందాడు. పిట్స్ లక్షణాలు వచ్చి పడిపోతే ఆస్పత్రికి తీసుకెళ్లామని ఈలోపే అజయ్​ గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక అజయ్‌ చనిపోయాడని ఎస్సీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మధ్యవర్తి ద్వారా రాజీ..!

విజయవాడ జీజీహెచ్​లో నిర్వహించిన శవపరీక్షలో వైద్యులు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు. ఫోరెన్సిక్‌ పరీక్ష ఫలితాలు వచ్చాకే కారణం తెలుస్తుందని అంటున్నారు. అజయ్‌ 87 కిలోలతో వయసుకు మించి అధిక బరువున్నట్లు తెలిపారు. యువకుడి మరణంపై కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనా....నిందితుల పేర్లను మాత్రం చేర్చలేదు. ఈ అంశం వివాదం కాకుండా ఉండేందుకు....అధికారులు మధ్యవర్తి ద్వారా కుటుంబసభ్యులతో రాజీ నడుపుతున్నట్లు చెబుతున్నారు. పరిహారంగా రూ.15 లక్షలు, 100 గజాల నివేశన స్థలం, కుటుంబంలో ఒకరికి ఒప్పంద ఉద్యోగం ఇచ్చేందుకు హామీ లభించినట్లు సమాచారం. గురువారమే ఈ ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎస్సీ సంఘాలు ఆందోళనను విరమించాయి.

ఇదీ చదవండి : జమిలి ఎన్నిలకు సిద్ధం కావాలి... పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

విజయవాడలో ఎస్సీ యువకుడి లాకప్‌డెత్‌ కేసు మరో మలుపు తిరిగింది. బాధిత కుటుంబంతో రాజీ కుదుర్చుకునేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. అక్రమంగా మద్యం రవాణా చేసిన కేసులో 11వ నిందితుడిగా ఉన్న డోవారి అజయ్‌ను ఎస్​ఈబీ పోలీసులు గురువారం విచారణ నిమిత్తం తీసుకెళ్లగా ఠాణాలో మృతి చెందాడు. పిట్స్ లక్షణాలు వచ్చి పడిపోతే ఆస్పత్రికి తీసుకెళ్లామని ఈలోపే అజయ్​ గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక అజయ్‌ చనిపోయాడని ఎస్సీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మధ్యవర్తి ద్వారా రాజీ..!

విజయవాడ జీజీహెచ్​లో నిర్వహించిన శవపరీక్షలో వైద్యులు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు. ఫోరెన్సిక్‌ పరీక్ష ఫలితాలు వచ్చాకే కారణం తెలుస్తుందని అంటున్నారు. అజయ్‌ 87 కిలోలతో వయసుకు మించి అధిక బరువున్నట్లు తెలిపారు. యువకుడి మరణంపై కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనా....నిందితుల పేర్లను మాత్రం చేర్చలేదు. ఈ అంశం వివాదం కాకుండా ఉండేందుకు....అధికారులు మధ్యవర్తి ద్వారా కుటుంబసభ్యులతో రాజీ నడుపుతున్నట్లు చెబుతున్నారు. పరిహారంగా రూ.15 లక్షలు, 100 గజాల నివేశన స్థలం, కుటుంబంలో ఒకరికి ఒప్పంద ఉద్యోగం ఇచ్చేందుకు హామీ లభించినట్లు సమాచారం. గురువారమే ఈ ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎస్సీ సంఘాలు ఆందోళనను విరమించాయి.

ఇదీ చదవండి : జమిలి ఎన్నిలకు సిద్ధం కావాలి... పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Last Updated : Oct 3, 2020, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.