దళితులంటే ఊరి చివర నివసించే వారనే భావన జగన్లో ఉందని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. శాసనసభ సాక్షిగా జగన్ దళితులను కించపరిచేలా మాట్లాడితే, వైకాపాలోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన్ని ఎలా సమర్థిస్తారని వర్ల నిలదీశారు. జగన్ ప్రభుత్వం దిగివచ్చి దళితులకు న్యాయం చేసేవరకు తెదేపా తరఫున జాతీయస్థాయిలో కూడా పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలోని ఆలయాలకు పటిష్ట భద్రత: డీజీపీ