ETV Bharat / city

దుర్గమ్మ శరన్నవ రాత్రి ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు

విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ అప్రమత్తమైంది. 1,597 మంది పోలీస్ సిబ్బంది, 18 సాయుధ బలగాలతో భద్రత కల్పిస్తున్నట్లు సీపీ శ్రీనివాసులు వెల్లడించారు.

author img

By

Published : Oct 17, 2020, 1:36 AM IST

durga temple
durga temple

ఇంద్రకీలాద్రిపై జరిగే దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని విజయవాడ సీపీ శ్రీనివాసులు వెల్లడించారు. శుక్రవారం సీపీ శ్రీనివాసులు దంపతులు కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు 1,597 మంది పోలీస్ సిబ్బంది, 18 సాయుధ బలగాలతో భద్రత కల్పిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఏడు ప్రాంతాల్లో పోలీసు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వీటితో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపడతామని వెల్లడించారు.

ఇంద్రకీలాద్రిపై జరిగే దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని విజయవాడ సీపీ శ్రీనివాసులు వెల్లడించారు. శుక్రవారం సీపీ శ్రీనివాసులు దంపతులు కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు 1,597 మంది పోలీస్ సిబ్బంది, 18 సాయుధ బలగాలతో భద్రత కల్పిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఏడు ప్రాంతాల్లో పోలీసు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వీటితో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపడతామని వెల్లడించారు.

ఇదీ చదవండి

దుర్గ గుడి పైవంతెన ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.