ETV Bharat / city

'చంద్రబాబు విశాఖ వెళ్తే జగన్​కు భయమెందుకు?'

author img

By

Published : May 25, 2020, 1:40 PM IST

వైకాపా ప్రభుత్వం, సీఎం జగన్​పై తెదేపా నేతలు విమర్శలు వర్షం కురిపించారు. వారు చేస్తున్న పనులపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. దేవినేని ఉమ, వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్ తదితరులు పలు ప్రశ్నలు గుప్పిస్తూ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీశారు.

tdp leaders fires on jagan and ycp goverment
వైకాపా ప్రభుత్వంపా తెదేపా నేతల విమర్శలు

చంద్రబాబు విశాఖలో పర్యటిస్తే ముఖ్యమంత్రి జగన్​కు అంత భయమెందుకో చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలు గౌరవించి ప్రభుత్వ అనుమతులతో ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు విశాఖ వెళ్తుంటే విమానాన్ని ఎందుకు రద్దు చేయించారని నిలదీశారు. రంగనాయ కమ్మ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ప్రశ్నలనే.. న్యాయస్థానం ప్రభుత్వాన్ని అడిగిందని ఉమా ట్విట్టర్​లో పేర్కొన్నారు.

tdp leaders fires on jagan and ycp goverment
వైకాపా ప్రభుత్వంపా తెదేపా నేతల ట్వీట్లు

ఒక్క మాస్కుతో పోయేదానికి..

ఎవరు ఎంతలా ఆపుదామని ప్రయత్నించినా చంద్రబాబు అమరావతికి వస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైద్యుడు సుధాకర్ విషయంలో మాస్కులు ఇస్తే పోయేదానికి.. సీబీఐ దాకా తెచ్చిన జగన్ సలహాదారుల గొప్పతనాన్ని అభినందించక తప్పడంలేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. కోట్లాది రూపాయల జీతం పొందుతూ, జగన్ ప్రభుత్వానికి వారు అందిస్తున్న సేవలకు జోహార్లంటూ ట్వీట్ చేశారు.

tdp leaders fires on jagan and ycp govermenttdp leaders fires on jagan and ycp goverment
వైకాపా ప్రభుత్వంపా తెదేపా నేతల ట్వీట్లు

ఇవీ చదవండి... తితిదే ఛైర్మన్​కు భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ

చంద్రబాబు విశాఖలో పర్యటిస్తే ముఖ్యమంత్రి జగన్​కు అంత భయమెందుకో చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలు గౌరవించి ప్రభుత్వ అనుమతులతో ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు విశాఖ వెళ్తుంటే విమానాన్ని ఎందుకు రద్దు చేయించారని నిలదీశారు. రంగనాయ కమ్మ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ప్రశ్నలనే.. న్యాయస్థానం ప్రభుత్వాన్ని అడిగిందని ఉమా ట్విట్టర్​లో పేర్కొన్నారు.

tdp leaders fires on jagan and ycp goverment
వైకాపా ప్రభుత్వంపా తెదేపా నేతల ట్వీట్లు

ఒక్క మాస్కుతో పోయేదానికి..

ఎవరు ఎంతలా ఆపుదామని ప్రయత్నించినా చంద్రబాబు అమరావతికి వస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైద్యుడు సుధాకర్ విషయంలో మాస్కులు ఇస్తే పోయేదానికి.. సీబీఐ దాకా తెచ్చిన జగన్ సలహాదారుల గొప్పతనాన్ని అభినందించక తప్పడంలేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. కోట్లాది రూపాయల జీతం పొందుతూ, జగన్ ప్రభుత్వానికి వారు అందిస్తున్న సేవలకు జోహార్లంటూ ట్వీట్ చేశారు.

tdp leaders fires on jagan and ycp govermenttdp leaders fires on jagan and ycp goverment
వైకాపా ప్రభుత్వంపా తెదేపా నేతల ట్వీట్లు

ఇవీ చదవండి... తితిదే ఛైర్మన్​కు భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.