రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఎలక్షనా ? లేక సెలక్షనా ? అని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రభుత్వాన్ని నిలదీశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెదేపా అభ్యర్థిని ఎస్ఐ కులం పేరుతో దూషించటం దుర్మార్గమన్నారు. పసుపు చొక్కా వేసుకున్న వాళ్లను హింసించాలని సీఎం జీవో ఇచ్చారా? పోలీసులను ప్రశ్నించారు. కొన్నిచోట్ల పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీతో కుమ్మక్కై..ఓటర్లు, అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఇదీచదవండి
'తెదేపా అభ్యర్థిని కులం పేరుతో దూషించిన ఎస్సైపై చర్యలు తీసుకోండి'