రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొనుగోళ్లకు విద్యుత్ డిస్కం పరిధిలోని ఉద్యోగుల వేతనాల్లో కోతపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం.. సీఎం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.
తమ సమ్మతి లేకుండానే సర్క్యులర్ ఇవ్వటాన్ని ఖండిస్తూ.. ఆ శాఖ ఉద్యోగులు మరుసటి రోజే ప్రత్యుత్తరం పంపించడాన్ని గుర్తుచేశారు. మద్యం, ఇసుక దందాల్లో కమీషన్లకు కోత విధిస్తే రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్లు కొనుగోలు చేయొచ్చని సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: